ETV Bharat / state

ఇద్దరు వ్యక్తులపై పోలీసులు దాడి... అడ్డుకున్న గ్రామస్థులు

అనంతపురం జిల్లా చిత్రచేడులో ఆదివారం ఉద్రిక్తత నెలకొంది. గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులపై పోలీసులు అన్యాయంగా దాడికి పాల్పడ్డారంటూ గ్రామస్థులు ఆందోళన చేశారు.

author img

By

Published : Aug 23, 2020, 8:38 PM IST

police attack on a person in chitrachedu ananthapuram district
పోలీసుల దాడిలో ఇద్దరు వ్యక్తులకు గాయాలు.

అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలం చిత్రచేడు గ్రామస్థులు ఆదివారం ఆందోళన నిర్వహించారు. గ్రామానికి చెందిన నల్లయ్య, అతని కుమారుడిపై పోలీసులు అన్యాయంగా దాడి చేశారని ఆరోపించారు.

గ్రామానికి చెందిన నల్లయ్య అనే వ్యక్తి నాటుసారా తరలిస్తున్నాడనే సమాచారంతో ఇద్దరు కానిస్టేబుళ్లు అతని బైక్​ను ఆపి తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో నల్లయ్యకు, వారికి వాగ్వాదం జరిగింది. ఆగ్రహించిన కానిస్టేబుళ్లు మరికొందరు పోలీసులతో కలిసి నల్లయ్య ఇంటికి వెళ్లి అతనితో పాటు అతని కుమారుడిపై దాడికి దిగారని గ్రామస్థులు తెలిపారు. ఈ ఘటనలో నల్లయ్య, అతని కుమారుడు గాయపడ్డారని చెప్పారు. పోలీసులు అన్యాయంగా వారిపై దాడి చేస్తుంటే తాము అడ్డుపడ్డామని వెల్లడించారు.

అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలం చిత్రచేడు గ్రామస్థులు ఆదివారం ఆందోళన నిర్వహించారు. గ్రామానికి చెందిన నల్లయ్య, అతని కుమారుడిపై పోలీసులు అన్యాయంగా దాడి చేశారని ఆరోపించారు.

గ్రామానికి చెందిన నల్లయ్య అనే వ్యక్తి నాటుసారా తరలిస్తున్నాడనే సమాచారంతో ఇద్దరు కానిస్టేబుళ్లు అతని బైక్​ను ఆపి తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో నల్లయ్యకు, వారికి వాగ్వాదం జరిగింది. ఆగ్రహించిన కానిస్టేబుళ్లు మరికొందరు పోలీసులతో కలిసి నల్లయ్య ఇంటికి వెళ్లి అతనితో పాటు అతని కుమారుడిపై దాడికి దిగారని గ్రామస్థులు తెలిపారు. ఈ ఘటనలో నల్లయ్య, అతని కుమారుడు గాయపడ్డారని చెప్పారు. పోలీసులు అన్యాయంగా వారిపై దాడి చేస్తుంటే తాము అడ్డుపడ్డామని వెల్లడించారు.

ఇదీ చదవండి

అక్కడ వర్షాలు కురిస్తే.. ఇక్కడ బోర్లు పాడయ్యాయి!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.