ETV Bharat / state

సెల్​ఫోన్​ కొనలేదని యువకుడి ఆత్మహత్య - ananthapur district latest news

తనకు సెల్​ఫోన్​ కొనివ్వలేదని తల్లితో గొడవ పడిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన అనంతపురంలో జరిగింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

person suicide due to cell phone in ananthapuram town
సెల్​ఫోన్​ విషయంలో మనస్థాపం చెంది యువకుడు ఆత్మహత్య
author img

By

Published : Jun 5, 2020, 10:35 PM IST

అనంతపురంలోని ఆదర్శనగర్​లో విజయ్ కుమార్(18) అనే యువకుడు తనకు సెల్​ఫోన్​ కొనివ్వలేదని తల్లితో గొడవపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానిక ఆదర్శ నగర్​లో తల్లి ఈశ్వరమ్మతో పాటుగా కుమారుడు విజయ్ కుమార్ బేల్దారి( తాపీమేస్త్రీ) పని చేసుకుంటూ జీవిస్తున్నాడు. తనకు చరవాణి కావాలని తల్లిని అడగటంతో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నందున కొద్ది రోజులు ఆగమని తల్లి ఈశ్వరమ్మ చెప్పింది.

ఈ విషయంపై కొద్దిరోజులుగా తల్లీ కొడుకుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో కొడుకును ఈశ్వరమ్మ గట్టిగా మందలించింది. దీనిపై మనస్తాపం చెందిన విజయ్​ ఉరి వేసుకుని చనిపోయాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అనంతపురంలోని ఆదర్శనగర్​లో విజయ్ కుమార్(18) అనే యువకుడు తనకు సెల్​ఫోన్​ కొనివ్వలేదని తల్లితో గొడవపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానిక ఆదర్శ నగర్​లో తల్లి ఈశ్వరమ్మతో పాటుగా కుమారుడు విజయ్ కుమార్ బేల్దారి( తాపీమేస్త్రీ) పని చేసుకుంటూ జీవిస్తున్నాడు. తనకు చరవాణి కావాలని తల్లిని అడగటంతో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నందున కొద్ది రోజులు ఆగమని తల్లి ఈశ్వరమ్మ చెప్పింది.

ఈ విషయంపై కొద్దిరోజులుగా తల్లీ కొడుకుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో కొడుకును ఈశ్వరమ్మ గట్టిగా మందలించింది. దీనిపై మనస్తాపం చెందిన విజయ్​ ఉరి వేసుకుని చనిపోయాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

మద్యానికి బానిసై వ్యక్తి ఆత్మహత్య..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.