కరోనా ఉద్ధృతి రోజురోజుకూ పెరిగిపోతున్నా కొంతమంది నిర్లక్ష్యం వీడటం లేదు. మార్కెట్లు, రహదారులపైకి వచ్చేటప్పుడు భౌతిక దూరం పాటించడం లేదు. మహమ్మారి ముప్పును మరిచి ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. వరలక్ష్మి వ్రతం నేపథ్యంలో అనంతపురం, తూర్పుగోదావరి జిల్లాల్లో గురువారం కనిపించిన ఈ రద్దీ దృశ్యాలు నిర్లక్ష్యానికి అద్దం పడుతున్నాయి. హిందూపురంలో వివిధ అవసరాల కోసం రోడ్లపైకి వచ్చిన జనం దూరం పాటించకుండా గుంపులుగా చేరారు. రాజమహేంద్రవరం మెయిన్రోడ్డులో జనసంద్రం జాతరను తలపించింది.
ఇవీ చదవండి...