అనంతపురం జిల్లా కదిరిలోని ఒక హోటల్లో మున్సిపల్ అధికారులు తనిఖీ చేశారు. స్థానికులు కదిరి శాసనసభ్యుడికి ఫిర్యాదు చేసినట్లు మున్సిపల్ అధికారులు తెలిపారు. పట్టణంలోని ఒక హోటల్ లో అపరిశుభ్రంగా ఉందని.. ముందురోజు పదార్థాలను తిరిగి వాడుతున్నారని ఆరోపణపై తనిఖీ చేశారు అధికారులు. ఉద్దేశ పూర్వకంగానే ఫిర్యాదు చేసి ఒక్క హోటల్ పైనే దాడి చేశారని హోటల్ యజమాని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: కేరళలో ఘోర విమాన ప్రమాదం.. 19 మంది మృతి