ETV Bharat / state

నన్ను విమర్శిస్తే ఊరుకోను: ఎమ్మెల్యే బాలకృష్ణ - hindupuram latest news

ప్రజాసేవ చేస్తున్న తనను విమర్శిస్తే ఊరుకోబోనని అనంతపురం జిల్లా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. రెండేళ్లలో ఎంత అభివృద్ధి చేశారో చెప్పే ధైర్యం కూడా అధికార పార్టీకి లేదన్నారు.

ఎమ్మెల్యే బాలకృష్ణ
ఎమ్మెల్యే బాలకృష్ణ
author img

By

Published : Mar 6, 2021, 12:22 PM IST

Updated : Mar 6, 2021, 2:15 PM IST

ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే బాలకృష్ణ

అనంతపురం జిల్లా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించారు. స్థానిక నాయకులు, ప్రభుత్వానికి తనదైన శైలిలో చురకలంటించారు. పట్టణంలోని 8వ వార్డు శ్రీకంఠపురం ప్రచారంలో ఆయన మాట్లాడారు. హిందూపురంలోని నాయకులు తనని విమర్శించడం తగదని ఎమ్మెల్యే అన్నారు. స్థానికంగా లేకపోయినా.. బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి ఛైర్మన్‌గా ప్రజలకు సేవ చేస్తున్నానని ఆయన తెలిపారు.

నటనతో ప్రజలకు వినోదంతో పాటు మంచి సందేశం అందిస్తున్నానని పేర్కొన్నారు. నియోజకవర్గం సమస్యలపై ఎప్పటికప్పుడు ఆరా తీసి.. వాటి పరిష్కారానికి కృషి చేయడం సమాజసేవ కాదా..? అంటూ ప్రశ్నించారు. స్థానికంగా ఉండే నాయకులు ఎంత మేరకు అభివృద్ధి చేశారన్నారు. ప్రభుత్వాన్ని నడుపుతున్నది మంత్రులు, ఎమ్మెల్యేలు కాదని.. ఇసుక, లిక్కర్​ మాఫియా వాళ్లంటూ విమర్శించారు. రెండేళ్లలో వైకాపా ఏమి చేసిందో చెప్పే ధైర్యం ఆ పార్టీ నేతలకు లేదని మండిపడ్డారు.

ఇదీ చదవండి:

వీళ్లు పగటి వేషగాళ్లు.. జనం ముందు బుకాయిస్తున్నారు: చంద్రబాబు

ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే బాలకృష్ణ

అనంతపురం జిల్లా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించారు. స్థానిక నాయకులు, ప్రభుత్వానికి తనదైన శైలిలో చురకలంటించారు. పట్టణంలోని 8వ వార్డు శ్రీకంఠపురం ప్రచారంలో ఆయన మాట్లాడారు. హిందూపురంలోని నాయకులు తనని విమర్శించడం తగదని ఎమ్మెల్యే అన్నారు. స్థానికంగా లేకపోయినా.. బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి ఛైర్మన్‌గా ప్రజలకు సేవ చేస్తున్నానని ఆయన తెలిపారు.

నటనతో ప్రజలకు వినోదంతో పాటు మంచి సందేశం అందిస్తున్నానని పేర్కొన్నారు. నియోజకవర్గం సమస్యలపై ఎప్పటికప్పుడు ఆరా తీసి.. వాటి పరిష్కారానికి కృషి చేయడం సమాజసేవ కాదా..? అంటూ ప్రశ్నించారు. స్థానికంగా ఉండే నాయకులు ఎంత మేరకు అభివృద్ధి చేశారన్నారు. ప్రభుత్వాన్ని నడుపుతున్నది మంత్రులు, ఎమ్మెల్యేలు కాదని.. ఇసుక, లిక్కర్​ మాఫియా వాళ్లంటూ విమర్శించారు. రెండేళ్లలో వైకాపా ఏమి చేసిందో చెప్పే ధైర్యం ఆ పార్టీ నేతలకు లేదని మండిపడ్డారు.

ఇదీ చదవండి:

వీళ్లు పగటి వేషగాళ్లు.. జనం ముందు బుకాయిస్తున్నారు: చంద్రబాబు

Last Updated : Mar 6, 2021, 2:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.