ETV Bharat / state

అనంతపురంలో కొవిడ్​ ఆస్పత్రిని ప్రారంభించిన మంత్రి బొత్స

author img

By

Published : Jun 1, 2021, 3:07 PM IST

అనంతపురం జిల్లాలో జర్మన్​ హ్యాంగర్​ టెక్నాలజీతో ఏర్పాటు చేసిన కొవిడ్​ ఆస్పత్రిని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రారంభించారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఇరవై రోజుల్లోనే ఆస్పత్రిని నిర్మించేందుకు కృషి చేసిన జిల్లా అధికారులను ఆయన అభినందించారు.

Minister Botsa Satyanarayana
వర్చువల్​ విధానంలో ఆస్పత్రిని ప్రారంభించిన మంత్రి బొత్స నారాయణ

అనంతపురంలో జర్మన్​ హ్యాంగర్​ టెక్నాలజీతో ఏర్పాటు చేసిన కొవిడ్​ ఆస్పత్రిని జిల్లా ఇన్​ఛార్జి మంత్రి బొత్స సత్యనారాయణ ప్రారంభించారు. విజయవాడ నుంచి వర్చువల్​ విధానంలో మంత్రి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ఆస్పత్రిలో 300 పడకలు, ఆక్సిజన్​ బెడ్స్​ ఏర్పాటు చేశారని చెప్పారు. కొవిడ్​ బాధితులకు సేవలందించేందుకు 20రోజుల్లోనే ఆస్పత్రిని సిద్ధం చేసిన జిల్లా అధికారులను మంత్రి అభినందించారు.

సీఎం జగన్​ చేతుల మీదుగా త్వరలో తాడిపత్రిలో 500 పడకల ఆస్పత్రి ప్రారంభించనున్నట్లు తెలిపారు. జిల్లాలో ఆక్సిజన్​ బెడ్ల కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రైవేటు కంటే ప్రభుత్వ సేవలు మిన్న అనేట్లుగా వైద్య సేవలు విస్తరిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా మంత్రి ఎం.శంకరనారాయణ, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

అనంతపురంలో జర్మన్​ హ్యాంగర్​ టెక్నాలజీతో ఏర్పాటు చేసిన కొవిడ్​ ఆస్పత్రిని జిల్లా ఇన్​ఛార్జి మంత్రి బొత్స సత్యనారాయణ ప్రారంభించారు. విజయవాడ నుంచి వర్చువల్​ విధానంలో మంత్రి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ఆస్పత్రిలో 300 పడకలు, ఆక్సిజన్​ బెడ్స్​ ఏర్పాటు చేశారని చెప్పారు. కొవిడ్​ బాధితులకు సేవలందించేందుకు 20రోజుల్లోనే ఆస్పత్రిని సిద్ధం చేసిన జిల్లా అధికారులను మంత్రి అభినందించారు.

సీఎం జగన్​ చేతుల మీదుగా త్వరలో తాడిపత్రిలో 500 పడకల ఆస్పత్రి ప్రారంభించనున్నట్లు తెలిపారు. జిల్లాలో ఆక్సిజన్​ బెడ్ల కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రైవేటు కంటే ప్రభుత్వ సేవలు మిన్న అనేట్లుగా వైద్య సేవలు విస్తరిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా మంత్రి ఎం.శంకరనారాయణ, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: 'జగన్ బెయిల్ రద్దు' పిటిషన్​పై.. విచారణ వాయిదా'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.