ETV Bharat / state

సైకిల్​పై 220 కిలోమీటర్ల ప్రయాణం... అనంతపురమే గమ్యం!

author img

By

Published : Apr 23, 2020, 11:30 AM IST

లాక్​డౌన్​ కారణంగా వలస కూలీలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం వారిని గుర్తించి తగిన వసతులు కల్పిస్తున్నప్పటికీ... అధికారుల కంటికి కనపడని వారందెరో ఉన్నారు. ఉత్తరప్రదేశ్​ రాష్ట్రానికి చెందిన 12 మంది యువకులు బెంగుళూరులో ఉంటూ... కుల్ఫీ ఐస్​ క్రీమ్​ అమ్ముకుంటూ జీవనం సాగించేవారు. లాక్​డౌన్ కారణంగా ఆదాయం లేక బెంగుళూరు నుంచి అనంతపురం జిల్లాకు సైకిల్​పై బయలుదేరారు. ఇప్పటికే 220 కిలోమీటర్లు సైకిల్​ తొక్కుకుంటూ వచ్చారు.

సైకిల్​పై 220కిలోమీటర్ల ప్రయాణం... అనంతపురమే గమ్యం!
సైకిల్​పై 220కిలోమీటర్ల ప్రయాణం... అనంతపురమే గమ్యం!

లాక్ డౌన్ ప్రభావంతో ఉపాధి లేక తినడానికి ఆహారం దొరక్క.. ఉపాధి కోసం వలస వెళ్లిన ప్రజలు బెంగళూరు నుంచి అనంతపురం వరకు 220 కిలోమీటర్ల మేరకు సైకిల్​పై ప్రయాణిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పలువురు యువకులు కొంతకాలం క్రితం ఉపాధి కోసం కుల్ఫీ ఐస్ క్రీమ్ అమ్ముతూ బెంగళూరుకు చేరారు. అక్కడ ఓ చిన్న గదిని అద్దెకు తీసుకొని రోజు సైకిల్​పై కుల్ఫీ ఐస్ క్రీమ్​ విక్రయించి జీవనం సాగించేవారు. లాక్​డౌన్​ కారణంగా ఉపాధి కోల్పోయి... ఆకలితో ఉండలేక.. అనంతపురంలో నివసిస్తున్న తమ కుటుంబ సభ్యుల వద్దకు సైకిల్​పై ప్రయాణం బయలుదేరామని వీరు తెలిపారు. ఈ రోజకు పెనుగొండ చేరుకున్నారు.

ఇదీ చూడండి:

లాక్ డౌన్ ప్రభావంతో ఉపాధి లేక తినడానికి ఆహారం దొరక్క.. ఉపాధి కోసం వలస వెళ్లిన ప్రజలు బెంగళూరు నుంచి అనంతపురం వరకు 220 కిలోమీటర్ల మేరకు సైకిల్​పై ప్రయాణిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పలువురు యువకులు కొంతకాలం క్రితం ఉపాధి కోసం కుల్ఫీ ఐస్ క్రీమ్ అమ్ముతూ బెంగళూరుకు చేరారు. అక్కడ ఓ చిన్న గదిని అద్దెకు తీసుకొని రోజు సైకిల్​పై కుల్ఫీ ఐస్ క్రీమ్​ విక్రయించి జీవనం సాగించేవారు. లాక్​డౌన్​ కారణంగా ఉపాధి కోల్పోయి... ఆకలితో ఉండలేక.. అనంతపురంలో నివసిస్తున్న తమ కుటుంబ సభ్యుల వద్దకు సైకిల్​పై ప్రయాణం బయలుదేరామని వీరు తెలిపారు. ఈ రోజకు పెనుగొండ చేరుకున్నారు.

ఇదీ చూడండి:

ఆ 2 జిల్లాల్లో కరోనా ఉద్ధృతి... రాష్ట్రంలో 60 కొత్త కేసులు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.