ETV Bharat / state

'కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మానవ హక్కులను ఉల్లంఘిస్తున్నాయి'

author img

By

Published : Dec 10, 2020, 6:16 PM IST

మానవహక్కుల దినోత్సవం సందర్భంగా మహిళా ఐక్య సంఘాల మానవహారం నిర్వహించారు. అనంతపురం పట్టణంలోని సప్తగిరి సర్కిల్​లో ఈ కార్యక్రమం జరిగింది.

Human Rights Day
మహిళా ఐక్య సంఘాల మానవహారం

మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా అనంతపురంలో మహిళా ఐక్య సంఘాల ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించారు. అనంతపురంలోని సప్తగిరి సర్కిల్​లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మానవ హక్కులను ఉల్లంఘిస్తూ... ప్రజావ్యతిరేక విధానాలు అవలంభిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు. దేశానికి అన్నం పెట్టే రైతన్నకూ కష్టాలు తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా హక్కులు.. మానవ హక్కులని ఐక్యరాజ్యసమితి చెప్పన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. హక్కులు సాధించుకునే వరకు ప్రభుత్వాలతో మహిళా సంఘాలు పోరాడుతాయని స్పష్టం చేశారు.

మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా అనంతపురంలో మహిళా ఐక్య సంఘాల ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించారు. అనంతపురంలోని సప్తగిరి సర్కిల్​లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మానవ హక్కులను ఉల్లంఘిస్తూ... ప్రజావ్యతిరేక విధానాలు అవలంభిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు. దేశానికి అన్నం పెట్టే రైతన్నకూ కష్టాలు తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా హక్కులు.. మానవ హక్కులని ఐక్యరాజ్యసమితి చెప్పన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. హక్కులు సాధించుకునే వరకు ప్రభుత్వాలతో మహిళా సంఘాలు పోరాడుతాయని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: 'మానవ హక్కుల దినోత్సవం రోజైనా బాధితులకు న్యాయం జరగాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.