ETV Bharat / state

హిజ్రా దారుణ హత్య.. డీజిల్‌ పోసి తగలబెట్టిన దుండగులు

author img

By

Published : Mar 20, 2021, 10:51 AM IST

ఓ హిజ్రాను గొంతుకోసి దారుణంగా హత్య చేసి..డీజిల్​ పోసి నిప్పంటించారు. ఈ ఘటన అనంతపురం జిల్లా హిందూపురం పట్టణం సమీపంలోని కొట్నుర్-కొల్లగుంట గ్రామాల మధ్య జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

hijra murder  at kotnur
హిజ్రా గొంతుకోసి డీజిల్‌ పోసి తగలబెట్టిన దుండగులు

అనంతపురం జిల్లా హిందూపురం పట్టణ శివారులో దారుణ హత్య జరిగింది. కొట్నుర్ కొల్లగుంట గ్రామాల మధ్య గుర్తుతెలియని వ్యక్తిని దుండగులు గొంతు కోసి హత్య చేసి... ఆపై డీజిల్ పోసి నిప్పంటించారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు..మరణించిన వ్యక్తి హిజ్రా అని ఒకటో పట్టణ సీఐ మద్దిలేటి బాల తెలిపారు. మృతదేహాన్ని హిందూపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు అన్నారు.

అనంతపురం జిల్లా హిందూపురం పట్టణ శివారులో దారుణ హత్య జరిగింది. కొట్నుర్ కొల్లగుంట గ్రామాల మధ్య గుర్తుతెలియని వ్యక్తిని దుండగులు గొంతు కోసి హత్య చేసి... ఆపై డీజిల్ పోసి నిప్పంటించారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు..మరణించిన వ్యక్తి హిజ్రా అని ఒకటో పట్టణ సీఐ మద్దిలేటి బాల తెలిపారు. మృతదేహాన్ని హిందూపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు అన్నారు.

ఇదీ చూడండి. హఠాత్తుగా పడిపోయాడు- సమయస్ఫూర్తితో కాపాడాడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.