ETV Bharat / state

ఎండిపోతున్న వేరుశనగ పంట.. కన్నీరు పెడుతున్న అనంత రైతు

author img

By

Published : Oct 3, 2021, 12:21 PM IST

అతివృష్టి, అనావృష్టి ఏదైనా అనంత రైతులకు కష్టాలు తప్పేలా లేవు. దేశంలోనే అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రాంతంగా ఉన్న కరవు సీమలో.. ఈ ఏడాది ముందస్తు వర్షాలతో పులకరించిన అన్నదాతల ఆశలు... అంతలోనే ఆవిరవుతున్నాయి. వేరుశెనగ ప్రధాన పంటగా సాగయ్యే ఖరీఫ్‌లో... వర్షాభావం రైతులను కన్నీరు పెట్టిస్తోంది. అప్పులు చేసి పెట్టుబడులు పెట్టిన అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.

http://10.10.50.85:6060/reg-lowres/01-October-2021/ap-atp-72-01-groundnut-crop-damage-pkg-ap10097_01102021074608_0110f_1633054568_18.mp4
http://10.10.50.85:6060/reg-lowres/01-October-2021/ap-atp-72-01-groundnut-crop-damage-pkg-ap10097_01102021074608_0110f_1633054568_18.mp4

అనంతపురం జిల్లాలో 20 ఏళ్లుగా వేరుశనగ రైతులు ఛిద్రమవుతున్నారు. సాగు చేసిన పంటలు చేతికి రాక పీకల్లోతు అప్పుల్లో మునిగిపోతున్నారు. అన్నదాతలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ ఏడాది ముందస్తు వర్షాలు ఊరించినా... వరుణుడు మళ్లీ కనిపించక... పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని... రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఎండిపోతున్న వేరుశనగ పంట.. కన్నీరు పెడుతున్న అనంత రైతు

ఉరవకొండ నియోజకవర్గంలోని విడపనకల్లు, వజ్రకరూర్‌, ఉరవకొండ మండలాల్లో వేరుశనగ పంట పూర్తిగా ఎండిపోయింది. అన్నదాతలు కంటికి రెప్పలా కాపాడిన పంటలు ఎండిపోవడంతో... తొలగిస్తున్నారు. విత్తువేసే సమయంలో వచ్చిన వర్షాలు.... పంట పెరిగిన తర్వాత రాకపోవడంతో పంట మొత్తం వాడిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వర్షాలు పడినా లాభం లేదని.. ఇప్పుడే పంట తొలగిస్తే కనీసం పశువులకు దాణా మిగులుతుందని అన్నదాతలు వాపోతున్నారు. చీకలగుర్కి గ్రామంలో ఒకే రోజు దాదాపు వంద ఎకరాల్లో వేరుశనగ పంటను రైతులు తొలగించారు. తమకు పక్కనే వెళ్తున్న హంద్రీనీవా కాలువ ద్వారా బ్రాంచ్ కెనాల్ ఏర్పాటు చేశారని... కానీ... నీరు అందించడం లేదని వాపోయారు. ప్రభుత్వం స్పందించి నీరు అందిస్తే కనీసం కొద్ది మంది రైతులకైనా న్యాయం జరిగేదంటున్నారు.

ప్రభుత్వం రైతుల పరిస్థితిపై దృష్టి సారించాలని... ముఖ్యంగా వేరుశనగ పంటను ప్రత్యేకంగా పరిగణించి ఆదుకోవాలని అనంతపురం జిల్లా రైతులు కోరుతున్నారు.

ఇదీ చదవండి: వలల రక్షణ.. కెమెరాల వీక్షణ!

అనంతపురం జిల్లాలో 20 ఏళ్లుగా వేరుశనగ రైతులు ఛిద్రమవుతున్నారు. సాగు చేసిన పంటలు చేతికి రాక పీకల్లోతు అప్పుల్లో మునిగిపోతున్నారు. అన్నదాతలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ ఏడాది ముందస్తు వర్షాలు ఊరించినా... వరుణుడు మళ్లీ కనిపించక... పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని... రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఎండిపోతున్న వేరుశనగ పంట.. కన్నీరు పెడుతున్న అనంత రైతు

ఉరవకొండ నియోజకవర్గంలోని విడపనకల్లు, వజ్రకరూర్‌, ఉరవకొండ మండలాల్లో వేరుశనగ పంట పూర్తిగా ఎండిపోయింది. అన్నదాతలు కంటికి రెప్పలా కాపాడిన పంటలు ఎండిపోవడంతో... తొలగిస్తున్నారు. విత్తువేసే సమయంలో వచ్చిన వర్షాలు.... పంట పెరిగిన తర్వాత రాకపోవడంతో పంట మొత్తం వాడిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వర్షాలు పడినా లాభం లేదని.. ఇప్పుడే పంట తొలగిస్తే కనీసం పశువులకు దాణా మిగులుతుందని అన్నదాతలు వాపోతున్నారు. చీకలగుర్కి గ్రామంలో ఒకే రోజు దాదాపు వంద ఎకరాల్లో వేరుశనగ పంటను రైతులు తొలగించారు. తమకు పక్కనే వెళ్తున్న హంద్రీనీవా కాలువ ద్వారా బ్రాంచ్ కెనాల్ ఏర్పాటు చేశారని... కానీ... నీరు అందించడం లేదని వాపోయారు. ప్రభుత్వం స్పందించి నీరు అందిస్తే కనీసం కొద్ది మంది రైతులకైనా న్యాయం జరిగేదంటున్నారు.

ప్రభుత్వం రైతుల పరిస్థితిపై దృష్టి సారించాలని... ముఖ్యంగా వేరుశనగ పంటను ప్రత్యేకంగా పరిగణించి ఆదుకోవాలని అనంతపురం జిల్లా రైతులు కోరుతున్నారు.

ఇదీ చదవండి: వలల రక్షణ.. కెమెరాల వీక్షణ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.