అనంతపురంలో ఎన్టీఆర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆర్ట్స్ కళాశాల ఎదుట తెదేపా కార్యకర్తలతో కలిసి మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రస్తుత అధికార పార్టీ వ్యవహార తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రభాకర్.. ప్రతిపక్షాన్ని ఏదోరకంగా ఇబ్బందిపెట్టే విధంగా వైకాపా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు.
హిందూపురంలో...
నందమూరి తారక రామారావు జయంతిని పురస్కరించుకొని హిందూపురంలో పార్టీ నేతలు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నియోజవర్గవ్యాప్తంగా పలు సేవాకార్యక్రమాలు నిర్వహించారు.
రాయదుర్గంలో...
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, స్వర్గీయ నందమూరి తారకరామారావు జయంతిని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. రాయదుర్గం పట్టణంలోని శాంతి నగర్లోని ఎన్టీఆర్ విగ్రహానికి పూల మాలలు వేశారు.
ఇదీచదవండి.