ETV Bharat / state

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో కొనసాగుతున్న దసరా వేడుకలు

author img

By

Published : Oct 24, 2020, 6:15 PM IST

అనంతపురం జిల్లా పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా నిలయంలో ఆయుధపూజ నిర్వహించారు. మరోవైపు పూర్ణచంద్ర ఆడిటోరియంలో వేద పురుష సప్తాహా జ్ఞాన యజ్ఞం కొనసాగుతోంది.

Dussehra celebrations at puttaparthi prasanthi nilayam
పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో కొనసాగుతున్న దసరా వేడుకలు
పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో కొనసాగుతున్న దసరా వేడుకలు

అనంతపురం జిల్లా పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో దసరా వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. మహార్నవమి సందర్భంగా ఆయుధపూజ ఘనంగా నిర్వహించారు. సాయి కుల్వంత్ మందిరంలో సత్యసాయి స్వర్ణ రథం, వాహనాలకు ఆయుధ పూజ చేశారు.

బాబా ఉన్నప్పుడు ఈ రథం, వాహనాల్లోనే తిరిగే వారు. అందుకే బాబా తిరిగిన వాహనాలకు ఆయుధ పూజ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. సత్యసాయి మహాసమాధిని, వాహనాలను రంగు రంగుల పూలతో అలంకరించి పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో సత్యసాయి ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ రత్నాకర్ పాల్గొన్నారు. మరోవైపు పూర్ణచంద్ర ఆడిటోరియంలో వేద పురుష సప్తాహా జ్ఞాన యజ్ఞం కొనసాగుతోంది.

ఇదీ చూడండి:

రాష్ట్రంలో వరద నష్టం అంచనాకు త్వరలోనే కేంద్ర బృందం పర్యటన

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో కొనసాగుతున్న దసరా వేడుకలు

అనంతపురం జిల్లా పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో దసరా వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. మహార్నవమి సందర్భంగా ఆయుధపూజ ఘనంగా నిర్వహించారు. సాయి కుల్వంత్ మందిరంలో సత్యసాయి స్వర్ణ రథం, వాహనాలకు ఆయుధ పూజ చేశారు.

బాబా ఉన్నప్పుడు ఈ రథం, వాహనాల్లోనే తిరిగే వారు. అందుకే బాబా తిరిగిన వాహనాలకు ఆయుధ పూజ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. సత్యసాయి మహాసమాధిని, వాహనాలను రంగు రంగుల పూలతో అలంకరించి పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో సత్యసాయి ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ రత్నాకర్ పాల్గొన్నారు. మరోవైపు పూర్ణచంద్ర ఆడిటోరియంలో వేద పురుష సప్తాహా జ్ఞాన యజ్ఞం కొనసాగుతోంది.

ఇదీ చూడండి:

రాష్ట్రంలో వరద నష్టం అంచనాకు త్వరలోనే కేంద్ర బృందం పర్యటన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.