అనంతపురం జిల్లా పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో దసరా వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. మహార్నవమి సందర్భంగా ఆయుధపూజ ఘనంగా నిర్వహించారు. సాయి కుల్వంత్ మందిరంలో సత్యసాయి స్వర్ణ రథం, వాహనాలకు ఆయుధ పూజ చేశారు.
బాబా ఉన్నప్పుడు ఈ రథం, వాహనాల్లోనే తిరిగే వారు. అందుకే బాబా తిరిగిన వాహనాలకు ఆయుధ పూజ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. సత్యసాయి మహాసమాధిని, వాహనాలను రంగు రంగుల పూలతో అలంకరించి పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో సత్యసాయి ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ రత్నాకర్ పాల్గొన్నారు. మరోవైపు పూర్ణచంద్ర ఆడిటోరియంలో వేద పురుష సప్తాహా జ్ఞాన యజ్ఞం కొనసాగుతోంది.
ఇదీ చూడండి: