ETV Bharat / state

ఇంట్లో అందరూ ఉండగానే... ఇంటికి 'లాక్' డౌన్​! - అనంతపురంలో లాక్​డౌన్​తో ఇంటికి తాళం

లాక్​డౌన్​ ఉంది.. ఇంటి నుంచి బయటకు రాకండి.. అందులో మన జిల్లాలో కరోనా పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి.. అస్సలు బయటకు రాకండి అంటే ప్రజలు అంతగా పట్టించుకోకుండా.. ఏదో ఒక పనిమీద బయటకు వస్తూనే ఉన్నారు. అందుకే 100శాతం లాక్​డౌన్​ని అమలు పరచాలనుకున్నారు ఓ అధికారి. అనుకున్నదే తడువుగా ఇళ్లకి తాళం వేసేస్తున్నారు.

due to lockdown houses are locked by lepakshi thasildhar at ananthapuram district
due to lockdown houses are locked by lepakshi thasildhar at ananthapuram district
author img

By

Published : Apr 4, 2020, 10:47 AM IST

ఇంట్లో అందరూ ఉండగానే... ఇంటికి 'లాక్' డౌన్​!

అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గంలో రెండు పాజిటివ్ కేసులు నమోదు కావడంతో అధికారులు నివారణ చర్యలు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా లేపాక్షి తహసీల్దారు బలరాం నూతనంగా ఆలోచించారు. మండల కేంద్రంలో ఇళ్ల గేటుకు తాళం వేసి తాళం చెవి వారి చేతికే ఇస్తున్నారు. ఈ నెల 14వరకు ఎట్టి పరిస్థితిలో ఇళ్లనుంచి ఎవరూ బయటకు రాకుడదంటూ వైరస్ గురించి అవగాహన కల్పిస్తున్నారు. నిత్యావసర సరకులు, పాలు, కిరాణా వస్తువులు తీసుకోవడానికి... రోజూ అరగంటపాటు మినహయింపు ఇస్తున్నారు. ఆరోగ్య సమస్యలు వస్తే తప్పా.. ఇంటి నుంచి బయటకు రావద్దంటూ తెలియచేస్తున్నారు. ఇంటిగేటుకు తాళం వేసే కార్యక్రమం విజయవంతమైతే ఇదే తరహాలో మండలవ్యాప్తంగా అమలు చేస్తామని అన్నారు. దీనివల్ల అనవసరంగా బయటకు తిరగకుండా వందశాతం లాక్​డౌన్​ను విజయవంతం చేయొచ్చని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంతో కరోనా మహమ్మారి పారద్రోలగలమని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి: కరోనా వెతలు.. కుదేలైన పంటలు, పరిశ్రమలు

ఇంట్లో అందరూ ఉండగానే... ఇంటికి 'లాక్' డౌన్​!

అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గంలో రెండు పాజిటివ్ కేసులు నమోదు కావడంతో అధికారులు నివారణ చర్యలు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా లేపాక్షి తహసీల్దారు బలరాం నూతనంగా ఆలోచించారు. మండల కేంద్రంలో ఇళ్ల గేటుకు తాళం వేసి తాళం చెవి వారి చేతికే ఇస్తున్నారు. ఈ నెల 14వరకు ఎట్టి పరిస్థితిలో ఇళ్లనుంచి ఎవరూ బయటకు రాకుడదంటూ వైరస్ గురించి అవగాహన కల్పిస్తున్నారు. నిత్యావసర సరకులు, పాలు, కిరాణా వస్తువులు తీసుకోవడానికి... రోజూ అరగంటపాటు మినహయింపు ఇస్తున్నారు. ఆరోగ్య సమస్యలు వస్తే తప్పా.. ఇంటి నుంచి బయటకు రావద్దంటూ తెలియచేస్తున్నారు. ఇంటిగేటుకు తాళం వేసే కార్యక్రమం విజయవంతమైతే ఇదే తరహాలో మండలవ్యాప్తంగా అమలు చేస్తామని అన్నారు. దీనివల్ల అనవసరంగా బయటకు తిరగకుండా వందశాతం లాక్​డౌన్​ను విజయవంతం చేయొచ్చని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంతో కరోనా మహమ్మారి పారద్రోలగలమని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి: కరోనా వెతలు.. కుదేలైన పంటలు, పరిశ్రమలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.