ETV Bharat / state

అనుమానాస్పద స్థితిలో డిగ్రీ విద్యార్థిని మృతి - అనుమానస్పద స్థితిలో డిగ్రీ విద్యార్థిని మృతి

ఓ డిగ్రీ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన అనంతపురం జిల్లా తురకపల్లిలో చోటు చేసుకుంది. శరీరంపై గాయాలు ఉండటంతో తల్లిదండ్రుల పోలీసులకు ఫిర్యాదు చేశారు.

డిగ్రీ విద్యార్థిని మృతి
author img

By

Published : Oct 6, 2019, 9:29 PM IST

డిగ్రీ విద్యార్థిని మృతి

అనంతపురం జిల్లా తురకపల్లిలో ఓ డిగ్రీ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. గ్రామానికి చెందిన మేరీ జోష్న డిగ్రీ మెుదటి సంవత్సరం చదువుతోంది. నిన్న సాయంత్రం గ్రామ సమీపంలోని రోడ్డు పక్కన ఆమె మృతదేహాన్ని స్థానికులు గమనించారు. మెుదట కాలుజారి కిందపడి చనిపోయిందని కుటుంబ సభ్యులు భావించారు. ఆమె ఒంటిపై గాయాలు ఉండటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై గుత్తి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. మృతురాలి తలపై గాయం..మెడను తాడుతో బిగించినట్లు ఆనవాళ్లు లభించటంతో హత్యగా పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యుల నివేదిక అనంతరం కేసులో పురోగతి సాధిస్తామని పోలీసులు తెలిపారు.

డిగ్రీ విద్యార్థిని మృతి

అనంతపురం జిల్లా తురకపల్లిలో ఓ డిగ్రీ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. గ్రామానికి చెందిన మేరీ జోష్న డిగ్రీ మెుదటి సంవత్సరం చదువుతోంది. నిన్న సాయంత్రం గ్రామ సమీపంలోని రోడ్డు పక్కన ఆమె మృతదేహాన్ని స్థానికులు గమనించారు. మెుదట కాలుజారి కిందపడి చనిపోయిందని కుటుంబ సభ్యులు భావించారు. ఆమె ఒంటిపై గాయాలు ఉండటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై గుత్తి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. మృతురాలి తలపై గాయం..మెడను తాడుతో బిగించినట్లు ఆనవాళ్లు లభించటంతో హత్యగా పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యుల నివేదిక అనంతరం కేసులో పురోగతి సాధిస్తామని పోలీసులు తెలిపారు.

ఇదీచదవండి

కారు ప్రమాదం: 'తెల్లారి'పోయిన తండ్రీకొడుకుల జీవితాలు

Intro:ATP :- అనంతపురం జిల్లా, గుత్తి మండలం, తురక పల్లి గ్రామ సమీపంలో ఓ మైనర్ బాలిక హత్యకు గురైనట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గుత్తి పట్టణ ప్రాంతం తురక పల్లి గ్రామానికి చెందిన రాజు కుమార్తె మేరీ జోస్నా డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. నిన్న సాయంత్రం తురక పల్లి గ్రామ రోడ్డు సమీపంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఆమెను గుర్తించి స్థానికులు గుత్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. దీనిపై కుటుంబీకులు హత్య జరిగినట్లు అనుమానించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.


Body:దీనిపై గుత్తి పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మొదట అమ్మాయి కాలుజారి నీటిలో పడిందని, ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు పలు ఆరోపణలు రావడంతో పోలీసులు దీనిపై లోతుగా దర్యాప్తు చేపట్టడానికి అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చారు. ప్రస్తుతం మృతురాలి తలకు గాయం, మెడకు తాడు తో బిగించిన ఆనవాళ్లను బట్టి హత్యగా పోలీసులు భావిస్తున్నారు. పోస్టుమార్టం ఆధారాల నిమిత్తం నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని గుత్తి పట్టణ సిఐ రాజశేఖర్రెడ్డి తెలిపారు.

బైట్.... రాజశేఖర్ రెడ్డి, గుత్తి పట్టణ సీఐ, అనంతపురం జిల్లా


Conclusion:అనంతపురం ఈటీవీ భారత్ రిపోర్టర్ రాజేష్ సెల్ నెంబర్ :- 7032975446.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.