ETV Bharat / state

విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ సీపీఐ ధర్నా - విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా కదిరిలో సీపీఐ నేతల ధర్నా

కరోనా కష్ట సమయంలో లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలను ఆదుకోవాల్సిన ప్రభుత్వం.. విద్యుత్ ఛార్జీలను భారీగా పెంచి వారిని మరింత కష్టపెట్టడం సరికాదని సీపీఐ నాయకులు అన్నారు. అనంతపురం జిల్లా కదిరిలో ఆందోళన చేశారు.

cpi leaders dharnaa at kadiri ananthapuram district against high power charges
విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ సీపీఐ నేతల ధర్నా
author img

By

Published : May 13, 2020, 5:48 PM IST

విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ అనంతపురం జిల్లా కదిరిలో సీపీఐ నాయకులు ఆందోళన చేపట్టారు. పట్టణంలోని విద్యుత్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. లాక్ డౌన్ వల్ల ఉపాధి లేక పేద, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. ఇలాంటి సమయంలో 3 రెట్లు కరెంట్ బిల్లులు వేయడం సమంజసం కాదన్నారు.

తెల్ల రేషన్ కార్డుదారులకు బిల్లు మాఫీతో పాటు, మిగతా వినియోగదారులకు పెంచిన ధరలను తగ్గించాలన్నారు. ఉపాధి కోల్పోయిన వారికి బాసటగా నిలవాల్సిన ప్రభుత్వం ఛార్జీలు పెంచుతూ ప్రజలను ఇబ్బందులు పెట్టడం సరికాదని హితవు పలికారు. ఏడీఈ షాజహాన్​కు వినతిపత్రం అందజేశారు.

విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ అనంతపురం జిల్లా కదిరిలో సీపీఐ నాయకులు ఆందోళన చేపట్టారు. పట్టణంలోని విద్యుత్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. లాక్ డౌన్ వల్ల ఉపాధి లేక పేద, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. ఇలాంటి సమయంలో 3 రెట్లు కరెంట్ బిల్లులు వేయడం సమంజసం కాదన్నారు.

తెల్ల రేషన్ కార్డుదారులకు బిల్లు మాఫీతో పాటు, మిగతా వినియోగదారులకు పెంచిన ధరలను తగ్గించాలన్నారు. ఉపాధి కోల్పోయిన వారికి బాసటగా నిలవాల్సిన ప్రభుత్వం ఛార్జీలు పెంచుతూ ప్రజలను ఇబ్బందులు పెట్టడం సరికాదని హితవు పలికారు. ఏడీఈ షాజహాన్​కు వినతిపత్రం అందజేశారు.

ఇవీ చదవండి:

ప్రధాన వార్తలు @11am

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.