ETV Bharat / state

కార్మికుల సమస్యలు పరిష్కరించాల్సిందే: సీఐటీయూ

author img

By

Published : Jun 12, 2021, 9:23 AM IST

నగరపాలక సంస్థలో ఒప్పంద ప్రాతిపదికన పనిచేస్తున్న కార్మికులందరినీ రెగ్యులర్‌ చేయాలని సీఐటీయూ ఆందోళన చేపట్టింది. ఈ క్రమంలో కార్మికులు, సీఐటీయూ నాయకులు అర్ధనగ్న ప్రదర్శన చేసి నిరసన వ్యక్తం చేశారు.

citu protest
citu protest

అనంతపురం జిల్లా పెనుకొండ పట్టణంలోని నగర పంచాయతీ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించాలని 14 రోజులుగా సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. శనివారం ఉదయం పెనుకొండ నగర పంచాయతీ కార్యాలయం ఎదుట సీఐటియూ జిల్లా కార్యదర్శి రమేష్ ఆధ్వర్యంలో కార్మికులు అర్ధనగ్న ప్రదర్శన చేశారు. శరీరానికి ఆకులు కట్టుకుని నిరసన తెలిపారు.

నగర పంచాయతీలో పనిచేస్తున్న కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించి, బకాయిపడిన అలవెన్సు వెంటనే చెల్లించాలని, కార్మికులకు పీఎఫ్ ఇఎస్ఐ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నగర పంచాయతీ పారిశుద్ధ్య కార్మికుల యూనియన్ నాయకులు చిన్న వెంకటేశు, రాము తదితరులు పాల్గొన్నారు.

అనంతపురం జిల్లా పెనుకొండ పట్టణంలోని నగర పంచాయతీ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించాలని 14 రోజులుగా సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. శనివారం ఉదయం పెనుకొండ నగర పంచాయతీ కార్యాలయం ఎదుట సీఐటియూ జిల్లా కార్యదర్శి రమేష్ ఆధ్వర్యంలో కార్మికులు అర్ధనగ్న ప్రదర్శన చేశారు. శరీరానికి ఆకులు కట్టుకుని నిరసన తెలిపారు.

నగర పంచాయతీలో పనిచేస్తున్న కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించి, బకాయిపడిన అలవెన్సు వెంటనే చెల్లించాలని, కార్మికులకు పీఎఫ్ ఇఎస్ఐ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నగర పంచాయతీ పారిశుద్ధ్య కార్మికుల యూనియన్ నాయకులు చిన్న వెంకటేశు, రాము తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

పెరుగుతున్న ధరలు.. ఆదాయం లేక కుంగుతున్న పేదలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.