పౌరసత్వ సవరణ చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు భాజపా సంకల్పించింది. ఈ మేరకు జాతీయ ప్రధాన కార్యదర్శి సునిల్ దియోధర్ అనంతపురం జిల్లాలో మీడియా సమావేశం నిర్వహించారు. పొరుగు దేశాల్లో మతహింసను తట్టుకోలేక భారతదేశానికి వచ్చిన వారికి పౌరసత్వాన్ని కల్పిస్తున్నామని దియోధర్ పేర్కొన్నారు. ఎవరి పౌరసత్వాన్ని తీసుకోవటంలేదని ఆయన తెలిపారు. ఈ చట్టంపై కాంగ్రెస్, వామపక్షాలు ప్రజలను అయోమానికి గురిచేస్తున్నాయని ఆరోపించారు. కావాలనే సీఏఏకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. అనంతరం రాష్ట్ర రాజధానిపై స్పందించిన ఆయన... తెదేపా, వైకాపా రాష్ట్ర ప్రయోజనాలకోసం కాకుండా తమ సొంత లాభాల కోసం పనిచేస్తున్నాయని విమర్శించారు.
ఇదీ చూడండి