అనంతపురం జిల్లా హిందూపురం మండలం కిరికెర గ్రామానికి చెందిన సిద్ధారెడ్డికి బ్లాక్ ఫంగస్ సోకింది. అనంతపురం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో సరైన మందులు దొరకకపోవడంతో సిద్ధారెడ్డి కుమార్తె.. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను సంప్రదించింది. వెంటనే స్పందించిన బాలకృష్ణ.. చికిత్సకు అవసరమైన మందులను స్థానిక తెదేపా నాయకులతో సిద్ధారెడ్డి కుటుంబానికి అందించారు. ఎమ్మెల్యే బాలకృష్ణకు బాధిత కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
తన నాన్న ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పుడు అవసరమైన మందులను ఎమ్మెల్యే బాలకృష్ణ పంపారని సిద్ధారెడి కుమార్తె తెలిపారు. రోజు ఫోన్ చేసి యోగక్షేమాలు అడిగి తెలుసుకునేవారన్నారు. చికిత్స అనంతరం ఇంటికి వచ్చిన తర్వాత కూడా అవసరమైన మందులను కూడా స్థానిక నాయకులు ద్వారా పంపించటం ఆనందంగా ఉందన్నారు.
ఇదీ చదవండి: Balakrishna: హిందూపురానికి ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను పంపిన ఎమ్మెల్యే బాలకృష్ణ