ETV Bharat / state

ఆటో బోల్తా.. వలస కార్మికుడు మృతి, ఇద్దరికి గాయాలు - ఆటో బోల్తా తాజా వార్తలు

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం బోయినపల్లిలో ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో వలస కార్మికుడు ప్రాణాలు కోల్పోగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం క్షతగాత్రులను కళ్యాణదుర్గం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

auto overturned in kalyanadurgam
ఆటో బోల్తా
author img

By

Published : Mar 1, 2021, 10:47 AM IST

పొట్ట కూటి కోసం పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన ఓ యువకుడు రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డాడు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం బోయినపల్లి గ్రామ సమీపంలో ఆటో బోల్తా పడ్డ ఘటనలో ఒడిశాకు చెందిన చింటూ అనే కార్మికుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

మృతుడితో పాటు పని చేయడానికి వచ్చిన మరో యువకుడు, ఆటోడ్రైవర్​కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం వీరు కళ్యాణదుర్గం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోస్టుమార్టం నిమిత్తం చింటూ మృతదేహాన్ని కళ్యాణదుర్గం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

పొట్ట కూటి కోసం పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన ఓ యువకుడు రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డాడు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం బోయినపల్లి గ్రామ సమీపంలో ఆటో బోల్తా పడ్డ ఘటనలో ఒడిశాకు చెందిన చింటూ అనే కార్మికుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

మృతుడితో పాటు పని చేయడానికి వచ్చిన మరో యువకుడు, ఆటోడ్రైవర్​కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం వీరు కళ్యాణదుర్గం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోస్టుమార్టం నిమిత్తం చింటూ మృతదేహాన్ని కళ్యాణదుర్గం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ఇదీ చదవండి:

మతిస్థిమితం లేని వ్యక్తి.. ఉరి వేసుకుని ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.