వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాల్సిన అవసరం ఎంతైనా ఉందని... ఇందుకోసం తాము కృషి చేస్తామని మంత్రులు గుమ్మనూరు జయరాం, శంకరనారాయణలు స్పష్టం చేశారు. అనంతపురం ఆర్ట్స్ కళాశాల మైదానంలో జరిగిన వాల్మీకి జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమానికి అమాత్యులతో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు కూడా హాజరయ్యారు. వాల్మీకి జయంతిని కర్ణాటకలో ఎప్పటినుంచో రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నారని.. సీఎం చొరవతో ఇప్పుడు మన రాష్ట్రంలో కూడా ఇలా నిర్వహించడం ఆనందంగా ఉందని కార్మిక శాఖ మంత్రి జయరాం అన్నారు. ఇటీవల సచివాలయ ఉద్యోగ నియామకాల్లో 80 శాతం బీసీలు ఉండడం గర్వించదగ్గ విషయమని మంత్రి పేర్కొన్నారు. సమాజంలో వెనుకబడిన వర్గాలు పోటీ పడేలా ముందుకు వెళ్లాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి శంకర్నారాయణ అన్నారు. ప్రభుత్వం బీసీలకు అన్ని విధాలా చేయూతనందిస్తుందని తెలిపారు.
ఇదీ చూడండి: