ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలతో పాటు, రైతు సమస్యల పరిష్కారానికి చొరవ చూపుతానని అనంతపురం జిల్లా నూతన కలెక్టర్ సత్యనారాయణ తెలిపారు. ఇవాళ కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన ఆయనను.. వేద పండితులు ఆశీర్వదించారు. సంయుక్త కలెక్టర్, పలువురు అధికారులు, స్వచ్చంధ సంస్థల ప్రతినిధులు కలెక్టర్ సత్యనారాయణకు శుభాకాంక్షలు తెలిపారు. గతంలో ఈ జిల్లాలోనే సంయుక్త కలెక్టర్గా పనిచేసినట్లు సత్యనారాయణ గుర్తు చేసుకున్నారు. జిల్లా పరిస్థితులపై అవగాహన ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ ప్రారంభం కానున్నందున విత్తనాలు, ఎరువుల పంపిణీపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. తాగునీటి సమస్యతో పాటు, విద్య, వైద్య రంగాల అభ్యున్నతికి కృషి చేస్తానన్నారు.
ఇవీ చూడండి : తాగునీటి పైపులైన్లపై.. రోడ్డు నిర్మాణ పనుల ప్రభావం!