ETV Bharat / state

ఐసోలేషన్ సెంటర్​లో జడ్పీ సీఈవో తనిఖీలు - ananthapuram zp ceo latest news

బుక్కరాయసముద్రం మండలంలోని ప్రభుత్వ కస్తూరిబా బాలికల విద్యాలయంలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ కేంద్రాన్ని జడ్పీ సీఈవో శ్రీనివాసులు తనిఖీ చేశారు. కరోనా రోగులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు.

isolation center at bukkarayasamudram
isolation center at bukkarayasamudram
author img

By

Published : May 29, 2021, 4:30 PM IST

అనంతపురం బుక్కరాయసముద్రం మండలంలోని ప్రభుత్వ కస్తూరిబా బాలికల విద్యాలయంలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ కేంద్రాన్ని జడ్పీ సీఈవో శ్రీనివాసులు పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన... బాధితులకు సంబంధించిన వివరాలతో కూడిన రిజిస్టర్‌ను కేంద్రాల్లో నిర్వహించాలని చెప్పారు.

మందులను తీసుకోవడం గురించి రోగులకు సరైన అవగాహన కల్పించాలన్నారు. స్త్రీ, పురుషులకు ప్రత్యేక గదులకు సంబంధించిన సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని ఎప్పటికప్పుడు పిచికారీ చేయాలని చెప్పారు. పారిశుద్ధ్య కార్మికులు విధిగా పీపీఈ కిట్లు, గ్లౌజులు, మాస్కులు ధరించాలన్నారు.

అనంతపురం బుక్కరాయసముద్రం మండలంలోని ప్రభుత్వ కస్తూరిబా బాలికల విద్యాలయంలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ కేంద్రాన్ని జడ్పీ సీఈవో శ్రీనివాసులు పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన... బాధితులకు సంబంధించిన వివరాలతో కూడిన రిజిస్టర్‌ను కేంద్రాల్లో నిర్వహించాలని చెప్పారు.

మందులను తీసుకోవడం గురించి రోగులకు సరైన అవగాహన కల్పించాలన్నారు. స్త్రీ, పురుషులకు ప్రత్యేక గదులకు సంబంధించిన సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని ఎప్పటికప్పుడు పిచికారీ చేయాలని చెప్పారు. పారిశుద్ధ్య కార్మికులు విధిగా పీపీఈ కిట్లు, గ్లౌజులు, మాస్కులు ధరించాలన్నారు.

ఇదీ చదవండి:

Anandaiah Medicine: ఆనందయ్య మందు నివేదికలో ఏముంది..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.