ETV Bharat / state

పోలీసునూ వదలని కోవిడ్... వైరస్ సోకి సీఐ మృతి

author img

By

Published : Jul 14, 2020, 7:34 PM IST

రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి విస్తృతమవుతోంది. వాళ్లూ వీళ్లూ అన్న తేడా లేకుండా అందరికీ మచ్చెమటలు పట్టిస్తోంది. అత్యవసర సేవలు అందిస్తున్న సిబ్బందిపైనా పంజా విసురుతోంది. తాజాగా ఈ మహమ్మారి కోరలకు చిక్కిన అనంతపురం ట్రాఫిక్ సీఐ మృత్యువాత పడ్డారు.

Ananthapuram traffic CI Death With corona
ఎవరినీ వదలని మహమ్మారి.. కరోనాతో అనంతపురం సీఐ మృతి

అనంతపురం ట్రాఫిక్ సీఐ రాజశేఖర్.. కరోనా లక్షణాలతో మృతి చెందారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో నగరంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించగా.. కర్నూలుకు తరలిస్తుండగానే ప్రాణం విడిచారని పోలీసులు తెలిపారు.

కొద్ది రోజుల క్రితం రాజశేఖర్ కుటుంబ సభ్యులకు కరోనా పాజిటివ్ పరీక్షలు నిర్వహించగా.. ఇద్దరికి పాజిటివ్​గా తేలింది. రాజశేఖర్​కు నెగటివ్ వచ్చింది. కానీ... వారం రోజులుగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నందున మళ్లీ పరీక్షలు చేయించుకోగా.. వైరస్ ఉన్నట్లు తేలింది. చివరికి విషమ పరిస్థితుల్లో ఆయన కోవిడ్ కు బలయ్యారు.

అనంతపురం ట్రాఫిక్ సీఐ రాజశేఖర్.. కరోనా లక్షణాలతో మృతి చెందారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో నగరంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించగా.. కర్నూలుకు తరలిస్తుండగానే ప్రాణం విడిచారని పోలీసులు తెలిపారు.

కొద్ది రోజుల క్రితం రాజశేఖర్ కుటుంబ సభ్యులకు కరోనా పాజిటివ్ పరీక్షలు నిర్వహించగా.. ఇద్దరికి పాజిటివ్​గా తేలింది. రాజశేఖర్​కు నెగటివ్ వచ్చింది. కానీ... వారం రోజులుగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నందున మళ్లీ పరీక్షలు చేయించుకోగా.. వైరస్ ఉన్నట్లు తేలింది. చివరికి విషమ పరిస్థితుల్లో ఆయన కోవిడ్ కు బలయ్యారు.

ఇదీ చదవండి:

ఆ నలుగురికి.. అమరావతి రైతుల లేఖలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.