ETV Bharat / sports

సమిష్టి కృషితోనే విజయం :రోహిత్​

author img

By

Published : Feb 3, 2019, 9:02 PM IST

ఐదో వన్డేలో రాయుడు-విజయ్​ శంకర్​ల భాగస్వామ్యమే కీలకమన్నాడు కెప్టెన్​ రోహిత్​ శర్మ.

ట్రోఫీతో టీమిండియా

న్యూజిలాండ్​ గడ్డపై వన్డే సిరీస్​లో విజయం సాధించడంపై టీమిండియా సారథి రోహిత్​ శర్మ హర్షం వ్యక్తం చేశాడు. నాలుగో వన్డేలో ఘోర పరాభవం అనంతరం ఐదో వన్డేలో జట్టు సమిష్టి కృషితోనే విజయం సాధించామని వెల్లడించారు. వన్డే సిరీస్​ను భారత్​ 4-1తో కైవసం చేసుకుంది.

జట్టులో అందరూ రాణించడం ఎంతో అవసరమని అభిప్రాయపడ్డాడు రోహిత్​. లక్ష్య ఛేదనకే ప్రాధాన్యత ఇచ్చేవాళ్లమని, కానీ సిరీస్​ దక్కించుకోవడం వల్ల ప్రయోగాలకు అవకాశం లభించిందని రోహిత్​ తెలిపాడు.

రాయుడు-విజయ్ శంకర్​ల​ భాగస్వామ్యమే కీలకం...

మ్యాచ్​ విజయంలో రాయుడు- విజయ్​ శంకర్​లు నమోదు చేసిన 98 పరుగుల భాగస్వామ్యమే కీలకమని వివరించాడు రోహిత్​.

"నాలుగు వికెట్లు చేజార్చుకున్న తర్వాత, క్రీజులో నిలదొక్కుకునే వారు అవసరం. రాయుడు- విజయ్​ శంకర్​ ఆ పని చేశారు. చివర్లో హర్ధిక్​, కేదార్​ జాదవ్​ల ప్రదర్శన అద్భుతం."
---- రోహిత్​ శర్మ.

సరైన సమయాల్లో వికెట్లు తీశారు...

బౌలర్లు కలసికట్టుగా పనిచేయటం భారత్​ విజయానికి మరో కారణమని అన్నాడు రోహిత్​.

"ఓ దశలో ఛేదన ఎంతో సులభం అనిపించింది. కానీ బౌలర్లు అద్భుత ప్రదర్శన కనిబరిచారు. అందరి కృషి వల్లే విజయం సాధించాం. 250 పరుగులు ఆ పిచ్​పై మంచి స్కోర్​ అనిపించింది. కీలక సమయాల్లో బౌలర్లు వికెట్లు తీశారు."
--- రోహిత్​ శర్మ.

న్యూజిలాండ్​ గడ్డపై వన్డే సిరీస్​లో విజయం సాధించడంపై టీమిండియా సారథి రోహిత్​ శర్మ హర్షం వ్యక్తం చేశాడు. నాలుగో వన్డేలో ఘోర పరాభవం అనంతరం ఐదో వన్డేలో జట్టు సమిష్టి కృషితోనే విజయం సాధించామని వెల్లడించారు. వన్డే సిరీస్​ను భారత్​ 4-1తో కైవసం చేసుకుంది.

జట్టులో అందరూ రాణించడం ఎంతో అవసరమని అభిప్రాయపడ్డాడు రోహిత్​. లక్ష్య ఛేదనకే ప్రాధాన్యత ఇచ్చేవాళ్లమని, కానీ సిరీస్​ దక్కించుకోవడం వల్ల ప్రయోగాలకు అవకాశం లభించిందని రోహిత్​ తెలిపాడు.

రాయుడు-విజయ్ శంకర్​ల​ భాగస్వామ్యమే కీలకం...

మ్యాచ్​ విజయంలో రాయుడు- విజయ్​ శంకర్​లు నమోదు చేసిన 98 పరుగుల భాగస్వామ్యమే కీలకమని వివరించాడు రోహిత్​.

"నాలుగు వికెట్లు చేజార్చుకున్న తర్వాత, క్రీజులో నిలదొక్కుకునే వారు అవసరం. రాయుడు- విజయ్​ శంకర్​ ఆ పని చేశారు. చివర్లో హర్ధిక్​, కేదార్​ జాదవ్​ల ప్రదర్శన అద్భుతం."
---- రోహిత్​ శర్మ.

సరైన సమయాల్లో వికెట్లు తీశారు...

బౌలర్లు కలసికట్టుగా పనిచేయటం భారత్​ విజయానికి మరో కారణమని అన్నాడు రోహిత్​.

"ఓ దశలో ఛేదన ఎంతో సులభం అనిపించింది. కానీ బౌలర్లు అద్భుత ప్రదర్శన కనిబరిచారు. అందరి కృషి వల్లే విజయం సాధించాం. 250 పరుగులు ఆ పిచ్​పై మంచి స్కోర్​ అనిపించింది. కీలక సమయాల్లో బౌలర్లు వికెట్లు తీశారు."
--- రోహిత్​ శర్మ.

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.