విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. తోట్లవల్లూరు ఠాణా పరిధిలో పనిచేస్తున్న కానిస్టేబుళ్లు రాంబాబు, జమేశ్లపై వేటు వేశారు.పేకాట శిబిరాలపై దాడులు చేసేందుకు వెళ్లే ముందు నిందితులకు ఆ విషయాన్ని చేరవేస్తున్నారనే ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ఉన్నతాధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
విధి నిర్వహణలో అలసత్వం..
అనంతరం ప్రాథమిక విచారణ జరిపి నిందితులపై చర్యలు తీసుకున్నట్లు సమాచారం. మరో వైపు టాస్క్ఫోర్సులో ముగ్గురు సిబ్బందిని వీఆర్కు పంపారు. విధి నిర్వహణలో అలసత్వం వహిస్తున్నారని ఓ ఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్లను వీఆర్కు పంపారు.