అనంతపురం జిల్లా ఉరవకొండలో నకిలీ బంగారు నాణేల పేరుతో జరిగిన మోసాన్ని పోలీసులు ఛేదించారు. హైదరాబాద్కు చెందిన సత్యం అనే వ్యక్తికి అంజినప్ప, విజయ్లు మాటలు కలుపుతూ తమ వద్ద బంగారు నాణేలు ఉన్నాయని.. వాటిని తక్కువ ధరకే ఇస్తామని ఆశ చూపారు. ఇందులో భాగంగా ముందుగా రెండు అసలు నాణేలను ఇచ్చి సత్యానికి నమ్మకం కల్పించారు. 2 కిలోల నాణేలను రూ.9 లక్షలకే ఇస్తామని చెప్పారు. నమ్మిన సత్యం నాణేలను తీసుకున్నాడు. అనంతరం నాణేలు నకిలీవని గుర్తించిన సత్యం ఉరవకొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరిపారు. ఉరవకొండ సమీపంలో గాలిస్తుండగా.. అంజినప్ప, విజయ్ తప్పించుకుంటూ పోలీసుల కంట పడ్డారు. వారిని వెంబడించటంతో బ్యాగ్ వదిలేసి పరారయ్యారు. బ్యాగ్లో రూ.9 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పట్టుకునేందుకు గాలింపు ముమ్మరం చేశారు.
ఇదీ చూడండి: