ETV Bharat / jagte-raho

ఐపీఎల్ బెట్టింగ్ ఆట కట్టు: నలుగురు అరెస్ట్

author img

By

Published : Oct 6, 2020, 11:34 PM IST

కృష్ణ జిల్లా నూజివీడు పరిధి పోతిరెడ్డిపల్లి గ్రామంలో ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ బెట్టింగ్ నిర్వహిస్తున్న నలుగురు పోలీసులకు చిక్కారు. నిందితుల నుంచి సమారు రూ.45 వేలు, 7 సెల్ ఫోన్లు, టీవీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

నలుగురు ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ బుకీల అరెస్ట్ : సీఐ రామచంద్రారావు
నలుగురు ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ బుకీల అరెస్ట్ : సీఐ రామచంద్రారావు

కృష్ణ జిల్లా నూజివీడు మండలం పోతిరెడ్డిపల్లి గ్రామంలో ఐపీఎల్ బెట్టింగ్ నిర్వహిస్తున్న నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.45 వేల రూపాయల నగదు, 7 చరవాణులు, ఓ టీవీ స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.

విలాసాలు వద్దు కష్టఫలమే ముద్దు..

విలాసాలకు అలవాటు పడిన యువత, కష్టపడకుండా సునాయాసంగా డబ్బు సంపాదించాలనే దురుద్దేశంతో అడ్డదారులు తొక్కుతున్నారని సీఐ గుర్తు చేశారు. ఇలాంటి పరిణామాలు శిక్షార్హమేనని సీఐ రామచంద్రరావు పేర్కొన్నారు.

కష్టపడి బతకాలి..

సమాజంలో కష్టపడి సంపాదిస్తూ గౌరవప్రదంగా జీవించాలని సీఐ సూచించారు. సమావేశంలో రూరల్ ఎస్ఐ సీహెచ్ రంజిత్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు ఆదేశాల మేరకు నూజివీడు డీఎస్పీ బీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో విశ్వసనీయ సమాచారం మేరకు ఈ దాడి నిర్వహించినట్లు సీఐ తెలిపారు.

నలుగురు ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ బుకీల అరెస్ట్ : సీఐ రామచంద్రారావు
బెట్టింగ్ నిర్వహిస్తున్న నలుగురు అరెస్ట్

ఇవీ చూడండి : కృష్ణా, గోదావరి బోర్డుల పరిధి నిర్ణయాధికారం కేంద్రానిదే: షెకావత్‌

కృష్ణ జిల్లా నూజివీడు మండలం పోతిరెడ్డిపల్లి గ్రామంలో ఐపీఎల్ బెట్టింగ్ నిర్వహిస్తున్న నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.45 వేల రూపాయల నగదు, 7 చరవాణులు, ఓ టీవీ స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.

విలాసాలు వద్దు కష్టఫలమే ముద్దు..

విలాసాలకు అలవాటు పడిన యువత, కష్టపడకుండా సునాయాసంగా డబ్బు సంపాదించాలనే దురుద్దేశంతో అడ్డదారులు తొక్కుతున్నారని సీఐ గుర్తు చేశారు. ఇలాంటి పరిణామాలు శిక్షార్హమేనని సీఐ రామచంద్రరావు పేర్కొన్నారు.

కష్టపడి బతకాలి..

సమాజంలో కష్టపడి సంపాదిస్తూ గౌరవప్రదంగా జీవించాలని సీఐ సూచించారు. సమావేశంలో రూరల్ ఎస్ఐ సీహెచ్ రంజిత్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు ఆదేశాల మేరకు నూజివీడు డీఎస్పీ బీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో విశ్వసనీయ సమాచారం మేరకు ఈ దాడి నిర్వహించినట్లు సీఐ తెలిపారు.

నలుగురు ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ బుకీల అరెస్ట్ : సీఐ రామచంద్రారావు
బెట్టింగ్ నిర్వహిస్తున్న నలుగురు అరెస్ట్

ఇవీ చూడండి : కృష్ణా, గోదావరి బోర్డుల పరిధి నిర్ణయాధికారం కేంద్రానిదే: షెకావత్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.