ETV Bharat / jagte-raho
దిశ కేసులో కీలకదశకు పోలీసుల పరిశోధన - దిశ కేసు పురోగతి
తెలంగాణలో జరిగిన దిశ హత్యోదంతంపై ఆ రాష్ట్ర పోలీసుల పరిశోధన కీలకదశకు చేరుకుంది. హత్యాచారం చేసిన నిందితులకు వ్యతిరేకంగా పోలీసులు సేకరించిన సాక్ష్యాధారాలను పరీక్షించిన ఫోరెన్సిక్ ప్రయాగశాల.... నివేదికను సిద్ధం చేసినట్టు సమాచారం. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన పరికరాలు, యంత్రాలు, సూక్ష్మపరికరాలతో ప్రయోగశాలలో సాక్ష్యాధారాలను విశ్లేషించారు. ఒకటి రెండురోజుల్లో వీటిని పోలీసులకు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
![దిశ కేసులో కీలకదశకు పోలీసుల పరిశోధన disha-case-police-officers-investigation-in-depth](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5866154-1110-5866154-1580175018807.jpg?imwidth=3840)
disha-case-police-officers-investigation-in-depth
By
Published : Jan 28, 2020, 7:01 AM IST
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యాచార ఘటనలో తెలంగాణ పోలీసుల పరిశోధన కీలకదశలో ఉంది. నిందితులు... మహ్మద్ పాషా, జొల్లు శివ, చెన్నకేశవులు, నవీన్ కుమార్లకు వ్యతిరేకంగా ఈ కేసులో శంషాబాద్, షాద్నగర్ పోలీసులు సుమారు 40 సాక్ష్యాధారాలను ఫోరెన్సిక్ ప్రయోగశాలకు పరీక్షల నిమిత్తం పంపించారు. ఇందులో కీలకమైన సాక్ష్యాలు దిశ, ఆమె సోదరి స్వరం, తొండుపల్లి టోల్గేట్ వద్ద బాధితురాలని లాక్కెళ్లేటప్పుడు చిత్రీకరించిన సీసీ పుటేజీ, దిశ చరవాణిలోని నంబర్లు... సంక్షిప్త సందేశాలు.. ఫోన్ సంభాషణల నివేదికలను ప్రత్యేకంగా రూపొందించారు.
కీలకమైన సీసీకెమెరా దృశ్యాలు...
దిశ హత్యాచారానికి సంబంధించి తెలంగాణలోని తొండుపల్లి టోల్గేట్ కూడలి వద్ద ఉన్న సీసీ కెమెరాలో అత్యంత కీలకమైన చిత్రాలు నిక్షిప్తమయ్యాయి. పోలీసులు సమర్పించిన ఆ సీసీ కెమెరా పుటేజీని ఫోరెన్సిక్ ప్రయోగశాల అధికారులు సాంకేతిక పరిజ్ఞానంతో విశ్లేషించారు. నిందితుల ముఖాలు, పోలికలు కనిపించేలా సాంకేతికంగా అభివృద్ధి చేశారు.
సంభాషణల పరిశీలన...
దిశ, ఆమె సోదరి చరవాణులను స్వాధీనం చేసుకున్న పోలీసులు... వారి స్వరాలను ఫోరెన్సిక్ ప్రయోగశాల అధికారులకు అప్పగించారు. సంఘటన జరిగిన రోజు వారు మాట్లాడుకున్న సంభాషణల రికార్డులను పరిశీలించారు. వీటిని సాంకేతికంగా పరీక్షించగా.. వారిద్దరివేనని నిర్ధారణైంది. అదేరోజు రాత్రి 9 గంటల నుంచి 9 గంటల 40నిమిషాల వరకూ దిశ అక్కడే ఉన్నట్లు ఆమె చరవాణి పరిస్థితుల ప్రభావం ఆధారంగా ఉపయోగపడుతుందని తేల్చారు.
సుప్రీం ఆదేశాల మేరకు...
ఘటన జరగడానికి ముందు పదిహేను రోజులుగా దిశ ఎవరెవరితో మాట్లాడిందనే వివరాలనూ పరిశీలించారు. చటాన్పల్లి సమీపంలో జరిగిన ఎదురుకాల్పుల అనంతరం పోలీసులు స్వాధీనం చేసుకున్న తూటాలు, రివాల్వర్లనూ బాలిస్టిక్ నిపుణులు పరిశీలించి అందులోని వివరాల రిపోర్టును ఇచ్చారని సమాచారం.
సుప్రీంకోర్టు ఆదేశాల అనుగుణంగా ఈ సాక్ష్యాధారాలను విచారణ సమయంలో కోర్టుకు సమర్పించనున్నట్లు తెలుస్తోంది.
ఇవీ చూడండి: చనిపోయాడని అంత్యక్రియలు చేశారు... తిరిగొచ్చాక ఆశ్చర్యపోయారు..!
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యాచార ఘటనలో తెలంగాణ పోలీసుల పరిశోధన కీలకదశలో ఉంది. నిందితులు... మహ్మద్ పాషా, జొల్లు శివ, చెన్నకేశవులు, నవీన్ కుమార్లకు వ్యతిరేకంగా ఈ కేసులో శంషాబాద్, షాద్నగర్ పోలీసులు సుమారు 40 సాక్ష్యాధారాలను ఫోరెన్సిక్ ప్రయోగశాలకు పరీక్షల నిమిత్తం పంపించారు. ఇందులో కీలకమైన సాక్ష్యాలు దిశ, ఆమె సోదరి స్వరం, తొండుపల్లి టోల్గేట్ వద్ద బాధితురాలని లాక్కెళ్లేటప్పుడు చిత్రీకరించిన సీసీ పుటేజీ, దిశ చరవాణిలోని నంబర్లు... సంక్షిప్త సందేశాలు.. ఫోన్ సంభాషణల నివేదికలను ప్రత్యేకంగా రూపొందించారు.
కీలకమైన సీసీకెమెరా దృశ్యాలు...
దిశ హత్యాచారానికి సంబంధించి తెలంగాణలోని తొండుపల్లి టోల్గేట్ కూడలి వద్ద ఉన్న సీసీ కెమెరాలో అత్యంత కీలకమైన చిత్రాలు నిక్షిప్తమయ్యాయి. పోలీసులు సమర్పించిన ఆ సీసీ కెమెరా పుటేజీని ఫోరెన్సిక్ ప్రయోగశాల అధికారులు సాంకేతిక పరిజ్ఞానంతో విశ్లేషించారు. నిందితుల ముఖాలు, పోలికలు కనిపించేలా సాంకేతికంగా అభివృద్ధి చేశారు.
సంభాషణల పరిశీలన...
దిశ, ఆమె సోదరి చరవాణులను స్వాధీనం చేసుకున్న పోలీసులు... వారి స్వరాలను ఫోరెన్సిక్ ప్రయోగశాల అధికారులకు అప్పగించారు. సంఘటన జరిగిన రోజు వారు మాట్లాడుకున్న సంభాషణల రికార్డులను పరిశీలించారు. వీటిని సాంకేతికంగా పరీక్షించగా.. వారిద్దరివేనని నిర్ధారణైంది. అదేరోజు రాత్రి 9 గంటల నుంచి 9 గంటల 40నిమిషాల వరకూ దిశ అక్కడే ఉన్నట్లు ఆమె చరవాణి పరిస్థితుల ప్రభావం ఆధారంగా ఉపయోగపడుతుందని తేల్చారు.
సుప్రీం ఆదేశాల మేరకు...
ఘటన జరగడానికి ముందు పదిహేను రోజులుగా దిశ ఎవరెవరితో మాట్లాడిందనే వివరాలనూ పరిశీలించారు. చటాన్పల్లి సమీపంలో జరిగిన ఎదురుకాల్పుల అనంతరం పోలీసులు స్వాధీనం చేసుకున్న తూటాలు, రివాల్వర్లనూ బాలిస్టిక్ నిపుణులు పరిశీలించి అందులోని వివరాల రిపోర్టును ఇచ్చారని సమాచారం.
సుప్రీంకోర్టు ఆదేశాల అనుగుణంగా ఈ సాక్ష్యాధారాలను విచారణ సమయంలో కోర్టుకు సమర్పించనున్నట్లు తెలుస్తోంది.
ఇవీ చూడండి: చనిపోయాడని అంత్యక్రియలు చేశారు... తిరిగొచ్చాక ఆశ్చర్యపోయారు..!
TG_HYD_07_28_MUNCIPOLS_VOTING_PERSENTAGE_PKG_3182061
రిపోర్టర్: జ్యోతికిరణ్
NOTE: ఫైల్ విజువల్స్ వాడుకోగలరు
( ) రాష్ట్రవ్యాప్తంగా పురపాలక ఎన్నికలో పోలైన వాటిలో తెరాస 43 శాతం ఓట్లు సాధించింది. కాంగ్రెస్, భాజపా, ఎంఐఎం, ఇతర ప్రధాన పార్టీలతో పోల్చితే 120 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో అత్యధికంగా ఓట్లు చేజిక్కించుకుంది. పార్టీల పరంగా 99 పురపాలికలు, ఐదు నగరపాలికల్లో పోలైన ఓట్లలో 40 శాతానికి పైగా ఓట్లు తెరాసకు దక్కాయి. కాంగ్రెస్ పార్టీ ఐదు మున్సిపాలిటీల్లో తెరాసకు గట్టిపోటీ ఇవ్వగా, భాజపా నాలుగు చోట్ల ఆధిక్యం కనబరిచింది. ఎంఐఎం బైంసాలో మిగతా ప్రధాన పార్టీల కన్నా ఎక్కువ ఓట్లు పొందింది.......LOOK
VO.1: రాష్ట్రంలో జరిగిన ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తే పురపాలికలు, నగరపాలికల వారీగా వచ్చిన ఓట్లు, వాటి శాతాలు ఇలా ఉన్నాయి.
పో లైన ఓట్లు : 34, 95,322
చెల్లుబాటైనవి : 34,82,156
తెరాస : 15,77,235( 43.00శాతం )
కాంగ్రెస్: 7,96,396 ( 21.71శాతం )
భాజపా : 5,48,090 ( 14.94శాతం )
ఎంఐఎం : 1,21,374 ( 3.31శాతం )
ఇతరులు : 6,01,668 ( 16.40శాతం )
మొత్తం పురపాలికలు , నగరపాలికలు : 130
అత్యధికంగా పోలైన ఓట్లు తెరాస : 120 స్థానాల్లో
కాంగ్రెస్ : 5 ( చండూరు , చేర్యాల , మోత్కూరు , తుర్కయాంజాల్ , వడ్డేపల్లి )
భాజపా 4 ( భూత్పూరు , మక్తల్ , తుక్కుగూడ , అమనగల్ )
ఎంఐఎం : 1 ( భైంసా )
VO.2: పురపాలిక ఎన్నికల్లో మొత్తం పో లైన ఓట్లు 28,83,549 ఇందులో చెల్లుబాటైనవి 28,79,614 కాగా తెరాస 12,90,410 ( 44.81శాతం ), కాంగ్రెస్ 6,88,214 ( 23, 89శాతం ), భాజపా 3,75,221(13.03శాతం), ఎంఐఎం 78,326(2.72శాతం), ఇతరులు 4,4,443 (15.53శాతం)
మున్సిపాల్టీల వారిగా పోలైన ఓట్లు
పార్టీ 50 శాతంపైన 40 - 50 30 - 40 20 - 30 20 - 10 10 కన్నాతక్కువ
తెరాస 28 71 20 0 1 1
కాంగ్రెస్ 1 10 35 30 26 18
భాజపా 0 3 4 14 40 59
ఎంఐఎం 0 0 2 1 2 40
ఇతరులు 1 2 11 17 48 41
నగరపాలికల్లో పోలైన ఓట్లు మొత్తం 7,76,920
చెల్లినవి: 7,65,119
తెరాస 2,86,825( 37.48శాతం ), కాంగ్రెస్ 1,08,182( 14.13శాతం ), భాజపా 1,72,839( 22.58 శాతం), ఎంఐఎం 43,048(5.62శాతం), ఇతరులు 1,54,225( 20.15 శాతం )