పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం ఏఎస్ఐ, సర్వేయర్లపై... బొబ్బనపల్లిలో దాడి జరిగింది. భూతగాదాను పరిష్కరించేందుకు విధుల్లో భాగంగా వెళ్లిన ఏఎస్ఐ సారథిపై దుండగుడు కత్తితో దాడి చేశారు. ఈ ఘటనలో సర్వేయర్ బాబ్జీ కూడా గాయపడ్డాడు. ఏఎస్ఐ, సర్వేయర్లను తొలుత వీరవాసరం ఆసుపత్రికి తరలించగా... మెరుగైన చికిత్స నిమిత్తం భీమవరం ఆసుపత్రికి వారిద్దరినీ వైద్యులు పంపించారు. అరుణ్ అనే వ్యక్తి దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది.
స్పందించిన డీజీపీ
ఏఎస్సైపై దాడి ఘటనపై డీజీపీ స్పందించారు. క్షతగాత్రులకు అత్యవసర వైద్యం అందించాలని జిల్లా ఎస్పీని ఆదేశించారు. నిందితులను వెంటనే అదుపులోకి తీసుకోవాలన్నారు. ఘటనాస్థలానికి వెళ్లి పూర్తిస్థాయి దర్యాప్తు చేయాలని సూచించారు.
ఇదీ చదవండి