ETV Bharat / international

రాజకీయ లబ్ధి కోసమే ట్రంప్ ఆరోపణలు: చైనా

author img

By

Published : Sep 24, 2020, 8:25 AM IST

ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధుల సభలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రసంగంలోని వ్యాఖ్యలు అబద్ధాలని చైనా విమర్శించింది. ట్రంప్ ఆరోపణలు రాజకీయ లబ్ధి కోసమే చేశారని పేర్కొంది. చైనా కూడా వైరస్ బాధిత దేశమే అంటూ చెప్పుకొచ్చింది. డబ్ల్యూహెచ్​ఓను చైనా నడిపిస్తోందన్న ట్రంప్ వ్యాఖ్యలనూ తప్పుబట్టింది.

China says Trump's remarks against it full of 'fabricated lies' driven by ‘shady political motives'
రాజకీయ లబ్ధి కోసమే ట్రంప్ ఆరోపణలు: చైనా

ఐక్యరాజ్య సమితి వేదికగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రసంగంపై చైనా మండిపడింది. చైనాను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను ఖండించింది. ట్రంప్ ఆరోపణలన్నీ 'రాజకీయ లబ్ధికోసం చేసిన కల్పిత అబద్దాల'ని తిప్పికొట్టింది.

ఇదీ చదవండి: చైనాను జవాబుదారీ చేయాల్సిందే: ట్రంప్

ఐరాస సర్వసభ్య సమావేశంలో ట్రంప్ చేసిన ప్రసంగం వాస్తవాలను విస్మరించేదిగా ఉందని చైనా విదేశాంగ ప్రతినిధి వాంగ్ వెన్​బిన్ పేర్కొన్నారు. నిరాధారమైన ఆరోపణలు చేసేందుకు ట్రంప్ ఐరాస వేదికను ఎంచుకోవడంపై మండిపడ్డారు.

"చైనాకు వ్యతిరేకంగా చేసిన నిరాధారమైన ఆరోపణలను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. అబద్దాలను ఏ విధంగానూ నిజాలుగా మార్చలేరు. కొవిడ్​ను నియంత్రించడంలో చైనా రికార్డు ఏంటో ప్రపంచానికి తెలుసు. మానవాళి అంతటికీ వైరస్ ఉమ్మడి శత్రువు. చైనా కూడా వైరస్ బాధిత దేశమే. మహమ్మారి వ్యతిరేక పోరులో ప్రపంచంతో పాటు చైనా పోరాడింది."

-వాంగ్ వెన్​బిన్, చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి

ప్రపంచ ఆరోగ్య సంస్థను పరోక్షంగా చైనానే నడిపిస్తోందని ట్రంప్ చేసిన వ్యాఖ్యలను వాంగ్ తప్పుబట్టారు. డబ్ల్యూహెచ్​ఓ నుంచి అర్ధాంతరంగా అమెరికా తప్పుకుందని విమర్శించారు. ఈ నిర్ణయమే .. వైరస్ వ్యతిరేక పోరులో ప్రపంచదేశాల మధ్య సహకారాన్ని ప్రమాదంలో పడేసిందని అన్నారు. అమెరికాతో పాటు ప్రపంచంలోని అనేక దేశాల ప్రజలకు తీవ్ర నష్టాన్ని మిగిల్చిందని పేర్కొన్నారు. వైరస్​ను రాజకీయం చేయడం, ఇతరులను బలిపశువును చేయడం ఆపేసి.. అంతర్జాతీయ సమాజంతో కలిసి కరోనా వ్యతిరేక పోరులో పాల్గొనాలని అమెరికాకు హితవు పలికారు.

ఇదీ చదవండి: 'కరోనాను ప్రపంచంపైకి వదిలింది.. చైనాదే బాధ్యత'

మరోవైపు, పర్యావరణ పరిరక్షణకు చైనా పూర్తిగా కట్టుబడి ఉందని వాంగ్ వెన్​బిన్ స్పష్టం చేశారు. 2020- పర్యావరణ లక్ష్యాలను అనుకున్నదానికంటే ముందుగానే సాధించినట్లు తెలిపారు.

ఐక్యరాజ్య సమితి వేదికగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రసంగంపై చైనా మండిపడింది. చైనాను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను ఖండించింది. ట్రంప్ ఆరోపణలన్నీ 'రాజకీయ లబ్ధికోసం చేసిన కల్పిత అబద్దాల'ని తిప్పికొట్టింది.

ఇదీ చదవండి: చైనాను జవాబుదారీ చేయాల్సిందే: ట్రంప్

ఐరాస సర్వసభ్య సమావేశంలో ట్రంప్ చేసిన ప్రసంగం వాస్తవాలను విస్మరించేదిగా ఉందని చైనా విదేశాంగ ప్రతినిధి వాంగ్ వెన్​బిన్ పేర్కొన్నారు. నిరాధారమైన ఆరోపణలు చేసేందుకు ట్రంప్ ఐరాస వేదికను ఎంచుకోవడంపై మండిపడ్డారు.

"చైనాకు వ్యతిరేకంగా చేసిన నిరాధారమైన ఆరోపణలను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. అబద్దాలను ఏ విధంగానూ నిజాలుగా మార్చలేరు. కొవిడ్​ను నియంత్రించడంలో చైనా రికార్డు ఏంటో ప్రపంచానికి తెలుసు. మానవాళి అంతటికీ వైరస్ ఉమ్మడి శత్రువు. చైనా కూడా వైరస్ బాధిత దేశమే. మహమ్మారి వ్యతిరేక పోరులో ప్రపంచంతో పాటు చైనా పోరాడింది."

-వాంగ్ వెన్​బిన్, చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి

ప్రపంచ ఆరోగ్య సంస్థను పరోక్షంగా చైనానే నడిపిస్తోందని ట్రంప్ చేసిన వ్యాఖ్యలను వాంగ్ తప్పుబట్టారు. డబ్ల్యూహెచ్​ఓ నుంచి అర్ధాంతరంగా అమెరికా తప్పుకుందని విమర్శించారు. ఈ నిర్ణయమే .. వైరస్ వ్యతిరేక పోరులో ప్రపంచదేశాల మధ్య సహకారాన్ని ప్రమాదంలో పడేసిందని అన్నారు. అమెరికాతో పాటు ప్రపంచంలోని అనేక దేశాల ప్రజలకు తీవ్ర నష్టాన్ని మిగిల్చిందని పేర్కొన్నారు. వైరస్​ను రాజకీయం చేయడం, ఇతరులను బలిపశువును చేయడం ఆపేసి.. అంతర్జాతీయ సమాజంతో కలిసి కరోనా వ్యతిరేక పోరులో పాల్గొనాలని అమెరికాకు హితవు పలికారు.

ఇదీ చదవండి: 'కరోనాను ప్రపంచంపైకి వదిలింది.. చైనాదే బాధ్యత'

మరోవైపు, పర్యావరణ పరిరక్షణకు చైనా పూర్తిగా కట్టుబడి ఉందని వాంగ్ వెన్​బిన్ స్పష్టం చేశారు. 2020- పర్యావరణ లక్ష్యాలను అనుకున్నదానికంటే ముందుగానే సాధించినట్లు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.