తూర్పు గోదావరి జిల్లా సర్పవరం పోలీసులను మంగ అనే మహిళ ఆశ్రయించింది. తన భర్త సత్యనారాయణ శుక్రవారం నుంచి కనబడట్లేదని.. వైకాపా నాయకులే బెదిరించి అపహరించారని ఫిర్యాదులో పేర్కొంది. ఓ ప్రముఖ ఆయిల్ కంపెనీకి గడ్డి సరఫరా విషయంలో ఘర్షణ ఏర్పడినట్టు తెలిపింది.
ఆ గొడవలో వైకాపా నాయకులు గొల్లపల్లి కాశి, గూడాల శ్రీను, పితాని తిరుపతిరావు, దెయ్యాల సత్తిబాబు.. తన భర్తను బెదిరించారని ఆరోపించింది. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసినప్పటి నుంచి తమను వేధిస్తున్నారని వాపోయింది. తన భర్తను కాపాడి.. తగిన న్యాయం చేయాలని పోలీసులను వేడుకుంది.
ఇదీ చదవండి: