విశాఖపట్నం అరుకు ప్రాంతం నుంచి అక్రమంగా తరలిపోతున్న 1050 కేజీల గంజాయిని ఇచ్చాపురం పోలీసులు పట్టుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారుగా కోటి రూపాయల వరకు ఉంటుందన్నారు. పీఎస్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ అమిత్.. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించారు.
భారీగా గంజాయి రవాణా జరుగుతుందన్న పక్కా సమాచారంతో రాష్ట్ర సరిహద్దుల్లోని ఇచ్చాపురం సమీపంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. చార్కోల్ లోడుతో వెళ్తున్న లారీలో 1050 కేజీల గంజాయిను గుర్తించారు. దీని విలువ బహిరంగ మార్కెట్లో సుమారు కోటి రూపాయల వరకు ఉంటుంది. విశాఖ అరుకు నుంచి బీహార్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు తరలిస్తున్నట్లు తేలింది. ఈ కేసులో పలువురిని అదుపులోకి తీసుకున్నాం. ఈ రవాణాకు స్థానికుల సహకారం ఉందని దర్యాప్తులో వెల్లడైంది. త్వరలో వారిపై కూడా చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు.
ఇదీ చదవండి..