ETV Bharat / crime

తెలంగాణ: గోదావరిలో ఏడుగురు గల్లంతు.. ఆరుగురు మృతి

author img

By

Published : Apr 2, 2021, 11:43 AM IST

Updated : Apr 2, 2021, 1:26 PM IST

five dead in drowning incident nizamabad
five dead in drowning incident nizamabad

11:41 April 02

గోదావరిలో స్నానం చేస్తుండగా ఏడుగురు గల్లంతు

గోదావరిలో ఏడుగురు గల్లంతు.. నలుగురు మృతి

తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో ఘోరం జరిగింది. గోదావరి నదిలో నీటమునిగి ఆరుగురు మృతి చెందారు. ఓ బాలుడిని స్థానికులు కాపాడారు. నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం పోచంపాడ్ వద్ద వీఐపీ పుష్కరఘాట్​ వద్ద ఘటన జరిగింది.  

తెప్ప దీపం సమర్పించేందుకొచ్చి..

నిజామాబాద్ నగరం, మాక్లూర్, నందిపేట్ మండలాలకు చెందిన బంధువులు కుటుంబ సభ్యులతో కలిసి గోదావరి నదిలో తెప్ప దీపం సమర్పించేందుకు వెళ్లారు. ఈ క్రమంలో పిల్లలు నదిలో జారిపడగా.. కాపాడబోయిన పెద్దలు గల్లంతయ్యారు. మొత్తం ఏడుగురు గల్లంతు కాగా.. ఓ బాలుడిని స్థానికులు కాపాడారు. చనిపోయిన ఆరుగురిలో ముగ్గురు బాలురు ఉన్నారు.

మృతుల వివరాలు

 నిజామాబాద్ నగరంలోని ఎల్లమ్మ గుట్టకు చెందిన బొబ్బిలి శ్రీనివాస్ (40), అతడి కుమారులు శ్రీకర్(14), సిద్ధార్థ్(16), మాక్లూర్ మండలం గుత్ప గ్రామానికి చెందిన రాజు (24), నందిపేట్ మండలం డీకంపల్లికి చెందిన తండ్రి కుమారుడు సురేష్(40), యోగేష్(16). మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం బాల్కొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 

ఇదీ చదవండి

ఎస్ఈసీ సమావేశం..బహిష్కరించిన ప్రతిపక్షాలు

11:41 April 02

గోదావరిలో స్నానం చేస్తుండగా ఏడుగురు గల్లంతు

గోదావరిలో ఏడుగురు గల్లంతు.. నలుగురు మృతి

తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో ఘోరం జరిగింది. గోదావరి నదిలో నీటమునిగి ఆరుగురు మృతి చెందారు. ఓ బాలుడిని స్థానికులు కాపాడారు. నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం పోచంపాడ్ వద్ద వీఐపీ పుష్కరఘాట్​ వద్ద ఘటన జరిగింది.  

తెప్ప దీపం సమర్పించేందుకొచ్చి..

నిజామాబాద్ నగరం, మాక్లూర్, నందిపేట్ మండలాలకు చెందిన బంధువులు కుటుంబ సభ్యులతో కలిసి గోదావరి నదిలో తెప్ప దీపం సమర్పించేందుకు వెళ్లారు. ఈ క్రమంలో పిల్లలు నదిలో జారిపడగా.. కాపాడబోయిన పెద్దలు గల్లంతయ్యారు. మొత్తం ఏడుగురు గల్లంతు కాగా.. ఓ బాలుడిని స్థానికులు కాపాడారు. చనిపోయిన ఆరుగురిలో ముగ్గురు బాలురు ఉన్నారు.

మృతుల వివరాలు

 నిజామాబాద్ నగరంలోని ఎల్లమ్మ గుట్టకు చెందిన బొబ్బిలి శ్రీనివాస్ (40), అతడి కుమారులు శ్రీకర్(14), సిద్ధార్థ్(16), మాక్లూర్ మండలం గుత్ప గ్రామానికి చెందిన రాజు (24), నందిపేట్ మండలం డీకంపల్లికి చెందిన తండ్రి కుమారుడు సురేష్(40), యోగేష్(16). మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం బాల్కొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 

ఇదీ చదవండి

ఎస్ఈసీ సమావేశం..బహిష్కరించిన ప్రతిపక్షాలు

Last Updated : Apr 2, 2021, 1:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.