Accident: వైఎస్ఆర్ జిల్లా బద్వేలులో ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డివైడర్ను ఢీకొట్టింది. బెంగళూరు నుంచి కనిగిరి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అదృష్టవశాత్తు ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనలో డివైడర్తో పాటు బస్సు ముందుభాగం దెబ్బతింది. బస్సు ప్రమాదానికి గురి కావటంతో ప్రయాణికులు స్వస్థలాలకు వెళ్లేందుకు ఇబ్బందులు పడ్డారు.
ఇదీ చదవండి: Accident: కృష్ణా జిల్లా తాడంకి పైవంతెన వద్ద ప్రమాదం.. నలుగురికి గాయాలు