ETV Bharat / crime

పోలీసు వాహనం ఢీ కొని వ్యక్తి మృతి

author img

By

Published : Oct 22, 2022, 6:38 PM IST

ACCIDENT : మంత్రి కాన్వాయ్​ ముందు వెళ్తున్న పోలీసు వాహనం ఢీకొని ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన చిత్తూరు జిల్లా మదనపల్లి - పలమనేరు జాతీయ రహదారి వద్ద చోటుచేసుకుంది.

ACCIDENT
ACCIDENT

ACCIDENT : చిత్తూరు జిల్లా పెద్దపంజాణి మండల కేంద్రం వద్ద మదనపల్లి - పలమనేరు జాతీయ రహదారిపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాన్వాయ్ వాహనానికి ముందు వెళ్తున్న పోలీసు జీపు ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు అక్కడికక్కడే మృతిచెందగా, వాహనం వెనుక వస్తున్న టమోటా లోడ్ జీపు బోల్తా పడింది. మృతుడు బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన సుబ్రహ్మణ్యంగా పోలీసులు గుర్తించారు. పోలీస్ వాహనంలోని డ్రైవర్​కు స్వల్ప గాయాలయ్యాయి. కాన్వాయ్ వెనుక మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వాహనంకు ప్రమాదం ఏమీ జరగలేదు. ఘటనా స్థలాన్ని మంత్రి పరిశీలించారు.

ACCIDENT : చిత్తూరు జిల్లా పెద్దపంజాణి మండల కేంద్రం వద్ద మదనపల్లి - పలమనేరు జాతీయ రహదారిపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాన్వాయ్ వాహనానికి ముందు వెళ్తున్న పోలీసు జీపు ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు అక్కడికక్కడే మృతిచెందగా, వాహనం వెనుక వస్తున్న టమోటా లోడ్ జీపు బోల్తా పడింది. మృతుడు బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన సుబ్రహ్మణ్యంగా పోలీసులు గుర్తించారు. పోలీస్ వాహనంలోని డ్రైవర్​కు స్వల్ప గాయాలయ్యాయి. కాన్వాయ్ వెనుక మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వాహనంకు ప్రమాదం ఏమీ జరగలేదు. ఘటనా స్థలాన్ని మంత్రి పరిశీలించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.