ETV Bharat / crime

కంకిపాడులో అనుమానాస్పదంగా యువకుడి మృతి

author img

By

Published : Feb 3, 2021, 9:39 PM IST

కృష్ణా జిల్లా కంకిపాడు గ్రామంలోని ఓ ఖాళీ స్థలంలో యువకుని మృతదేహాన్ని గుర్తించారు. డెడ్​బాడీ కాలి ఉండటంతో పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతుడు తోట్లవల్లూరు గ్రామానికి చెందిన సన్నాలు గీతాకృష్ణగా గుర్తించారు.

a man suspected death at kankipadu
కంకిపాడులో కాలిన మృతదేహం గుర్తింపు

కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం కంకిపాడు గ్రామ సమీపంలోని ఓ ఖాళీ స్థలంలో ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. యువకుడు మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ మృతదేహం కాలిపోయి ఉండటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని శవాన్ని పరిశీలించారు. పక్కనే సెల్​ఫోన్, ఆధార్, బ్యాంకు పాసుబుక్ జీరాక్స్ కాపీలు దోరికాయి. వాటి ఆధారంగా మృతుడు తోట్లవల్లూరు గ్రామానికి చెందిన సన్నాలు గీతాకృష్ణగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. మృతుడిది ఆత్మహత్యా...? లేకా హత్య అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం కంకిపాడు గ్రామ సమీపంలోని ఓ ఖాళీ స్థలంలో ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. యువకుడు మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ మృతదేహం కాలిపోయి ఉండటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని శవాన్ని పరిశీలించారు. పక్కనే సెల్​ఫోన్, ఆధార్, బ్యాంకు పాసుబుక్ జీరాక్స్ కాపీలు దోరికాయి. వాటి ఆధారంగా మృతుడు తోట్లవల్లూరు గ్రామానికి చెందిన సన్నాలు గీతాకృష్ణగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. మృతుడిది ఆత్మహత్యా...? లేకా హత్య అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: వైకాపా జిల్లా కార్యదర్శిపై దాడి... బంగారం, నగదు చోరీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.