ETV Bharat / city

విశాఖ భూఅక్రమాలు...డిసెంబర్​లో సిట్ నివేదిక..!

author img

By

Published : Nov 29, 2020, 6:01 AM IST

విశాఖ భూఅక్రమాలపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) చేపట్టిన విచారణ చివరి దశకు చేరింది. కొవిడ్‌ కారణంగా ఆరు నెలల పాటు విచారణ నిలిచిపోయింది. గత నెల 22వ తేదీ నుంచి తిరిగి మొదలైన విచారణ చురుకుగా సాగుతోంది. ఆక్రమణదారుల చెరలో దాదాపు 400 ఎకరాల భూములున్నట్లు సిట్‌ వర్గాలు గుర్తించాయి. ఇవి ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఎన్‌వోసీల జారీలో జరిగిన అక్రమాల కారణంగా చేతులు మారిన భూములు, ప్రభుత్వ భూములు ఆక్రమణలు, కబ్జా చేసిన భూములు ఇలా పలు రకాల కింద వాటిని గుర్తించారు.

Visakha land scam
Visakha land scam
విశాఖ భూఅక్రమాలు...డిసెంబర్​లో సిట్ నివేదిక..!

భూరికార్డుల తారుమారు, ప్రభుత్వ భూముల ఆక్రమణ, కబ్జా తదితర ఆరు అంశాలపై విచారణ చేపట్టేందుకు విశ్రాంత ఐఏఎస్‌ అధికారి డాక్టర్‌ విజయకుమార్‌ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది నవంబరు 27న సిట్‌ ఏర్పాటుచేసింది. 1381 మంది సిట్‌కు ఫిర్యాదులు చేశారు. ఆయా ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలన చేసిన సిట్‌ పలు అక్రమాలను గుర్తించింది. ఈ ఏడాది జనవరిలో సిట్‌ మధ్యంతర నివేదికను సీఎంకు అందజేసింది. ఇప్పుడు పూర్తి స్థాయి నివేదికను సిద్ధం చేస్తున్నారు. డిసెంబరు మొదటి వారంలో నివేదికను అందజేయనుంది. రికార్డులను మళ్లీ ట్రెజరీకి పంపి భద్రపర్చాలని నిర్ణయించారు.

2017లో సిట్‌ అందజేసిన నివేదికలోని సారాంశాలను అధికారులు అధ్యయనం చేశారు. తాజాగా వచ్చిన ఫిర్యాదులు, వాటిలో పేర్కొన్న అంశాలు, రెవెన్యూ దస్త్రాల్లో పొందపర్చిన అంశాలు, నిబంధనలను పరిశీలన చేసి పూర్తిస్థాయి నివేదిక రూపొందించారు. ఆయా అక్రమాల విషయంలో బాధ్యులైన అధికారులు, సిబ్బందిని గుర్తించారు. 30కు పైగా జారీ చేసిన ఎన్‌వోసీల్లో అక్రమాలున్నట్లు తేల్చారు. బాధ్యులపై కఠిన చర్యలను తీసుకోవాలని సిఫార్సులు చేస్తున్నారు. మధురవాడ, పరవాడ, భీమునిపట్నం, విశాఖపట్నం గ్రామీణ మండలాల పరిధిలో జారీ చేసిన ఎన్‌వోసీలో అధికంగా అక్రమాలు చోటు చేసుకున్నట్లు నిర్ధరించారు.

ప్రభుత్వ భూముల జాబితా (22ఎ) రిజిస్టర్లలో అధికంగా తప్పిదాలు దొర్లాయని సిట్ గుర్తించింది. నగర పరిధిలో అనేక ప్రాంతాల్లో సబ్‌ డివిజన్లు జరగని కారణంగా మొత్తం సర్వే సంఖ్యలను 22ఎ జాబితాల్లో చేర్చారు. మాధవదార, మురళీనగర్, కోరమండల్‌గేట్‌ ప్రాంతం, రేసపువాని పాలెం తదితర ప్రాంతాల్లో ఏళ్ల తరబడి నివాసం ఉంటున్న అనేక మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆయా అంశాలపై స్పష్టమైన సూచనలతో సిట్‌ నివేదికను సిద్ధం చేసింది. ప్రభుత్వ భూములను తీసుకుని నిబంధనలకు విరుద్ధంగా వినియోగిస్తున్న అంశాలను గుర్తించారు. విలువైన భూములను ఈ రకంగా సొంతం చేసుకుని వాటిలో వ్యాపారాలు సాగిస్తున్న వారి చిట్టాలను తేల్చారు. ‌ నివేదికలో పొందపర్చిన అంశాలను పబ్లిక్‌ డొమైన్‌లో ఉంచాలని కొంత మంది సిట్‌కు సూచించారు.

ఇదీ చదవండి : సరుకు రవాణా మరింత విస్తరణ.. కార్గో సర్వీసుల ఛార్జీలు తగ్గింపు

విశాఖ భూఅక్రమాలు...డిసెంబర్​లో సిట్ నివేదిక..!

భూరికార్డుల తారుమారు, ప్రభుత్వ భూముల ఆక్రమణ, కబ్జా తదితర ఆరు అంశాలపై విచారణ చేపట్టేందుకు విశ్రాంత ఐఏఎస్‌ అధికారి డాక్టర్‌ విజయకుమార్‌ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది నవంబరు 27న సిట్‌ ఏర్పాటుచేసింది. 1381 మంది సిట్‌కు ఫిర్యాదులు చేశారు. ఆయా ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలన చేసిన సిట్‌ పలు అక్రమాలను గుర్తించింది. ఈ ఏడాది జనవరిలో సిట్‌ మధ్యంతర నివేదికను సీఎంకు అందజేసింది. ఇప్పుడు పూర్తి స్థాయి నివేదికను సిద్ధం చేస్తున్నారు. డిసెంబరు మొదటి వారంలో నివేదికను అందజేయనుంది. రికార్డులను మళ్లీ ట్రెజరీకి పంపి భద్రపర్చాలని నిర్ణయించారు.

2017లో సిట్‌ అందజేసిన నివేదికలోని సారాంశాలను అధికారులు అధ్యయనం చేశారు. తాజాగా వచ్చిన ఫిర్యాదులు, వాటిలో పేర్కొన్న అంశాలు, రెవెన్యూ దస్త్రాల్లో పొందపర్చిన అంశాలు, నిబంధనలను పరిశీలన చేసి పూర్తిస్థాయి నివేదిక రూపొందించారు. ఆయా అక్రమాల విషయంలో బాధ్యులైన అధికారులు, సిబ్బందిని గుర్తించారు. 30కు పైగా జారీ చేసిన ఎన్‌వోసీల్లో అక్రమాలున్నట్లు తేల్చారు. బాధ్యులపై కఠిన చర్యలను తీసుకోవాలని సిఫార్సులు చేస్తున్నారు. మధురవాడ, పరవాడ, భీమునిపట్నం, విశాఖపట్నం గ్రామీణ మండలాల పరిధిలో జారీ చేసిన ఎన్‌వోసీలో అధికంగా అక్రమాలు చోటు చేసుకున్నట్లు నిర్ధరించారు.

ప్రభుత్వ భూముల జాబితా (22ఎ) రిజిస్టర్లలో అధికంగా తప్పిదాలు దొర్లాయని సిట్ గుర్తించింది. నగర పరిధిలో అనేక ప్రాంతాల్లో సబ్‌ డివిజన్లు జరగని కారణంగా మొత్తం సర్వే సంఖ్యలను 22ఎ జాబితాల్లో చేర్చారు. మాధవదార, మురళీనగర్, కోరమండల్‌గేట్‌ ప్రాంతం, రేసపువాని పాలెం తదితర ప్రాంతాల్లో ఏళ్ల తరబడి నివాసం ఉంటున్న అనేక మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆయా అంశాలపై స్పష్టమైన సూచనలతో సిట్‌ నివేదికను సిద్ధం చేసింది. ప్రభుత్వ భూములను తీసుకుని నిబంధనలకు విరుద్ధంగా వినియోగిస్తున్న అంశాలను గుర్తించారు. విలువైన భూములను ఈ రకంగా సొంతం చేసుకుని వాటిలో వ్యాపారాలు సాగిస్తున్న వారి చిట్టాలను తేల్చారు. ‌ నివేదికలో పొందపర్చిన అంశాలను పబ్లిక్‌ డొమైన్‌లో ఉంచాలని కొంత మంది సిట్‌కు సూచించారు.

ఇదీ చదవండి : సరుకు రవాణా మరింత విస్తరణ.. కార్గో సర్వీసుల ఛార్జీలు తగ్గింపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.