ETV Bharat / city

విశాఖలో ఉద్యోగాల పేరుతో మోసం.. 150 మందికి కుచ్చుటోపీ

author img

By

Published : Nov 23, 2020, 10:48 PM IST

ఉద్యోగాల పేరుతో 150 మందిని బురిడీ కొట్టించిన ఘటన విశాఖలో జరిగింది. బాధితుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు... కూపీ లాగారు. ఉద్యోగాల పేరుతో పాత నేరస్థుడైన కిలపర్తి సందర్శ్ పలువురి నుంచి రూ.50 లక్షలు వసూలు చేసినట్లు గుర్తించారు.

job racket
job racket

విశాఖలో ఉద్యోగాల పేరుతో 150 మందికి కుచ్చుటోపీ పెట్టిన ఘటన వెలుగు చూసింది. సాన్ నెక్స్ జనరేషన్ పేరుతో నకిలీ సంస్థను స్థాపించి రూ. 50లక్షలు వసూలు చేసినట్లు వెల్లడైంది. ఇందులో ప్రధాన సూత్రదారుడిగా పాత నేరస్థుడైన కిలపర్తి సందర్శ్ ను గుర్తించారు. ఉద్యోగాల పేరుతో మాయమాటలు చెప్పి వసూళ్లు చేసినట్లు విచారణలో బయటపడింది. బాధితుల ఫిర్యాదుతో నాలుగో పట్టణ పోలీసులు దర్యాప్తు చేపట్టగా... కిలపర్తి సందర్శ్‌పై గతంలో అనేక కేసులు ఉన్నట్లు తేటతెల్లమైంది. నౌకాదళ ఉద్యోగాల పేరుతో మోసం చేసి గతంలోనూ సందర్శ్ జైలుకెళ్లాడు. జైలు నుంచి బయటకు వచ్చి మరికొందరిని సందర్శ్ మోసం చేసినట్లు తెలిసింది.

ఇదీ చదవండి

విశాఖలో ఉద్యోగాల పేరుతో 150 మందికి కుచ్చుటోపీ పెట్టిన ఘటన వెలుగు చూసింది. సాన్ నెక్స్ జనరేషన్ పేరుతో నకిలీ సంస్థను స్థాపించి రూ. 50లక్షలు వసూలు చేసినట్లు వెల్లడైంది. ఇందులో ప్రధాన సూత్రదారుడిగా పాత నేరస్థుడైన కిలపర్తి సందర్శ్ ను గుర్తించారు. ఉద్యోగాల పేరుతో మాయమాటలు చెప్పి వసూళ్లు చేసినట్లు విచారణలో బయటపడింది. బాధితుల ఫిర్యాదుతో నాలుగో పట్టణ పోలీసులు దర్యాప్తు చేపట్టగా... కిలపర్తి సందర్శ్‌పై గతంలో అనేక కేసులు ఉన్నట్లు తేటతెల్లమైంది. నౌకాదళ ఉద్యోగాల పేరుతో మోసం చేసి గతంలోనూ సందర్శ్ జైలుకెళ్లాడు. జైలు నుంచి బయటకు వచ్చి మరికొందరిని సందర్శ్ మోసం చేసినట్లు తెలిసింది.

ఇదీ చదవండి

డీఆర్సీ సమావేశంలో రసాభాస... వైకాపా ఎంపీ, ఎమ్మెల్యే వాగ్వాదం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.