ETV Bharat / city

తూర్పునౌకాదళంలో 'ఐ.ఎన్​.ఎస్​. రంజిత్​'కు వీడ్కోలు - andaman Lt. governor admiral

తూర్పునౌకాదళ ప్రధాన స్థావరమైన విశాఖపట్నంలో ఐ.ఎన్​.ఎస్​. రంజిత్​కి నౌకాదళం వీడ్కోలు పలికింది. మూడున్నర దశాబ్దాల పాటు ఈ నౌక సేవలు అందించింది.

తూర్పునౌకాదళంలో 'ఐ.ఎన్​.ఎస్​. రంజిత్​'కు వీడ్కోలు
author img

By

Published : May 7, 2019, 10:03 AM IST

తూర్పునౌకాదళంలో 'ఐ.ఎన్​.ఎస్​. రంజిత్​'కు వీడ్కోలు

మూడున్నర దశాబ్ధాల పాటు సేవలందించిన ఐ.ఎన్.ఎస్.రంజిత్​కి నౌకాదళం వీడ్కోలు పలికింది. అత్యంత సమర్ధవంతంగా సేవలందించిన ఈ నౌక ఎన్నో కీలక సమయాల్లో సామర్ధ్యాన్ని ప్రదర్శించి ఘనత చాటుకుందని నౌకాదళ అధికారులు ప్రశంసించారు. విశాఖపట్నం కేంద్రమైన తూర్పు నౌకాదళ ప్రధాన స్థావరంలో జరిగిన వీడ్కోలు సమావేశానికి అండమాన్ లెఫ్టినెంట్ గవర్నర్ అడ్మిరల్ దేవేంద్ర కుమార్ జోషి ముఖ్య అతిథిగా హాజరై గౌరవ వందనం స్వీకరించారు. 16 మంది అధికారులు, 10 మంది నావికులు, 23 మంది కమాండింగ్ అధికారులు ఈ నౌకకు వీడ్కోలు పలికారు. 1983లో రష్యాలో తయారైన ఈ నౌక... కమిషన్ నాటికి విష్ణు భగవత్ సారథ్యం వహించారు. వీడ్కోలు సమయంలో కెప్టెన్ విక్రమ్ సి.మెహ్రా కమాండింగ్ అధికారిగా ఉన్నారు.
2190 రోజుల్లో 7 లక్షల 43 వేల నాటికల్ మైళ్ళు పయనించి రికార్డ్ సృష్టించినది. ఇది ప్రపంచాన్ని 35 సార్లు చుట్టి వచ్చింది. అంటే భూమికి చంద్రునికి మధ్య దూరాన్ని లెక్కవేసినప్పుడు... మూడున్నర రెట్లు ఎక్కువతో సమానం. తూర్పు, పశ్చిమ నౌకాదళాలు నిర్వహించిన పలు కీలక ఆపరేషన్స్​లో రంజిత్ పాల్గొంది. సునామీ, హుద్‌హుద్ విపత్కార సమయాల్లో, సహాయ కార్యక్రమాల్లో పాల్గొంది. అలాగే పలు అవార్డులు పొందింది.

తూర్పునౌకాదళంలో 'ఐ.ఎన్​.ఎస్​. రంజిత్​'కు వీడ్కోలు

మూడున్నర దశాబ్ధాల పాటు సేవలందించిన ఐ.ఎన్.ఎస్.రంజిత్​కి నౌకాదళం వీడ్కోలు పలికింది. అత్యంత సమర్ధవంతంగా సేవలందించిన ఈ నౌక ఎన్నో కీలక సమయాల్లో సామర్ధ్యాన్ని ప్రదర్శించి ఘనత చాటుకుందని నౌకాదళ అధికారులు ప్రశంసించారు. విశాఖపట్నం కేంద్రమైన తూర్పు నౌకాదళ ప్రధాన స్థావరంలో జరిగిన వీడ్కోలు సమావేశానికి అండమాన్ లెఫ్టినెంట్ గవర్నర్ అడ్మిరల్ దేవేంద్ర కుమార్ జోషి ముఖ్య అతిథిగా హాజరై గౌరవ వందనం స్వీకరించారు. 16 మంది అధికారులు, 10 మంది నావికులు, 23 మంది కమాండింగ్ అధికారులు ఈ నౌకకు వీడ్కోలు పలికారు. 1983లో రష్యాలో తయారైన ఈ నౌక... కమిషన్ నాటికి విష్ణు భగవత్ సారథ్యం వహించారు. వీడ్కోలు సమయంలో కెప్టెన్ విక్రమ్ సి.మెహ్రా కమాండింగ్ అధికారిగా ఉన్నారు.
2190 రోజుల్లో 7 లక్షల 43 వేల నాటికల్ మైళ్ళు పయనించి రికార్డ్ సృష్టించినది. ఇది ప్రపంచాన్ని 35 సార్లు చుట్టి వచ్చింది. అంటే భూమికి చంద్రునికి మధ్య దూరాన్ని లెక్కవేసినప్పుడు... మూడున్నర రెట్లు ఎక్కువతో సమానం. తూర్పు, పశ్చిమ నౌకాదళాలు నిర్వహించిన పలు కీలక ఆపరేషన్స్​లో రంజిత్ పాల్గొంది. సునామీ, హుద్‌హుద్ విపత్కార సమయాల్లో, సహాయ కార్యక్రమాల్లో పాల్గొంది. అలాగే పలు అవార్డులు పొందింది.

ఇదీ చదవండీ :

ఒడిశా తుపాను బాధితులకు ఏపీ ఆర్థిక సాయం

Intro:శ్రీకాకుళం విజయనగరం జిల్లాల రైతులకు చిరకాల వాంఛ తీరబోతోంది తోటపల్లి పాత ఎడమ కుడి కాలువల ఆధునీకరణ పనులు చురుగ్గా సాగుతున్నాయి రూ 193 కోట్లు ప్రభుత్వం విడుదల చేయడంతో పనులు చకచకా సాగుతున్నాయి ఈ కాలువ పరిధిలో అధికారికంగా 38 వేల ఎకరాలు సాగు భూములు ఉన్నాయి అనధికారికంగా 70 వేల ఎకరాల వరకు భూములు ఉన్నాయి పూర్తిగా గా శిథిలావస్థకు చేరడంతో శివారు ప్రాంతాలకు గత పదేళ్లుగా సాగునీరు అందే పరిస్థితి లేదు గత కాంగ్రెస్ ప్రభుత్వం వన్ ఆధునికీకరణకు శంకుస్థాపన చేసినప్పటికీ నిధులు విడుదల చేయకపోవడంతో పనులు ముందుకు కదలలేదు రైతుల సమస్యలు స్థానిక నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లడంతో గత ఏడాది నిధులు విడుదల చేశారు దీంతో ప్రస్తుతం కౌలు పనులు జోరుగా సాగుతున్నాయి ప్రస్తుతం 12 కిలోమీటర్ల మేర కాలువలో పనులు జరుగుతున్నాయి 2020 జూన్ నాటికి పనులు పూర్తి చేయాల్సి ఉంది


Body:palakonda


Conclusion:8008574300
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.