ETV Bharat / city

చంద్రబాబుకు 151 కింద నోటీసెలా ఇస్తారు: హైకోర్టు - చంద్రబాబు విశాఖ ఘటనలో హైకోర్టులో వాదనలు

తెదేపా అధినేత చంద్రబాబు పర్యటనను విశాఖలో అడ్డుకున్న వారిపై ఏ చర్యలు తీసుకున్నారో చెప్పాలని డీజీపీ గౌతం సవాంగ్​ను హైకోర్టు ప్రశ్నించింది. సీఆర్​పీసీ 151 కింద నోటీసులు ఎలా ఇస్తారని అడిగిన ధర్మాసనం.. ఒకసారి 151 సెక్షన్ ఆర్డర్ చదవాలని సూచించింది.

high court trails on chandrababu vizag incident
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు
author img

By

Published : Mar 12, 2020, 5:21 PM IST

విశాఖలో తెదేపా అధినేత చంద్రబాబును అడ్డుకోవటంపై దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు విచారించింది. ప్రతిపక్షనేత చంద్రబాబుకు సీఆర్‌పీసీ 151 కింద నోటీసెలా ఇస్తారని ధర్మాసనం ప్రశ్నించింది. 151 కింద నోటీసు ఇచ్చిన అధికారులపై ఏం చర్యలు తీసుకున్నారని అడిగిన ప్రశ్నకు.. కోర్టులో కేసు పెండింగ్‌లో ఉన్నందున చర్యలు తీసుకోలేదని డీజీపీ గౌతం సవాంగ్ బదులిచ్చారు. సంబంధిత అధికారులపై వెంటనే చర్యలు తీసుకుంటామని డీజీపీ కోర్టుకు తెలిపారు. దీనిపై స్పందించిన ప్రధాన న్యాయమూర్తి సీఆర్​పీసీ 151 సెక్షన్​ ఆర్డర్​ చదవాలని డీజీపీకి సూచించారు.

ఇవీ చదవండి:

విశాఖలో తెదేపా అధినేత చంద్రబాబును అడ్డుకోవటంపై దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు విచారించింది. ప్రతిపక్షనేత చంద్రబాబుకు సీఆర్‌పీసీ 151 కింద నోటీసెలా ఇస్తారని ధర్మాసనం ప్రశ్నించింది. 151 కింద నోటీసు ఇచ్చిన అధికారులపై ఏం చర్యలు తీసుకున్నారని అడిగిన ప్రశ్నకు.. కోర్టులో కేసు పెండింగ్‌లో ఉన్నందున చర్యలు తీసుకోలేదని డీజీపీ గౌతం సవాంగ్ బదులిచ్చారు. సంబంధిత అధికారులపై వెంటనే చర్యలు తీసుకుంటామని డీజీపీ కోర్టుకు తెలిపారు. దీనిపై స్పందించిన ప్రధాన న్యాయమూర్తి సీఆర్​పీసీ 151 సెక్షన్​ ఆర్డర్​ చదవాలని డీజీపీకి సూచించారు.

ఇవీ చదవండి:

ఇలా దౌర్జన్యాలకు పాల్పడితే ఎన్నికలు ఎందుకు?'

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.