ETV Bharat / city

Fire Accident: విశాఖ హెచ్‌పీసీఎల్‌ రిఫైనరీలో అగ్నిప్రమాదం.. తప్పిన ముప్పు

author img

By

Published : Feb 12, 2022, 7:13 PM IST

విశాఖ హెచ్‌పీసీఎల్‌ రిఫైనరీ ఎమ్మెస్‌ బ్లాక్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అప్రమత్తమైన అధికారులు ఐదుసార్లు అత్యవసర సైరన్ మోగించటంతో కార్మికులు బయటకు వచ్చేశారు. సీఐఎస్‌ఎఫ్‌, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురావటంతో పెను ప్రమాదం తప్పింది.

విశాఖ హెచ్‌పీసీఎల్‌ రిఫైనరీలో అగ్నిప్రమాదం
విశాఖ హెచ్‌పీసీఎల్‌ రిఫైనరీలో అగ్నిప్రమాదం

విశాఖ హెచ్​పీసీఎల్​లో అగ్నిప్రమాదం జరిగింది. అధికారులు సకాలంలో సైరన్‌ మోగించి అందరినీ అప్రమత్తం చేయటంతో పెనుముప్పు తప్పింది. హుటాహుటిన కార్మికులను అక్కడి నుంచి దూరంగా పంపించేశారు. సీఐఎస్​ఎఫ్​, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు.

హెచ్​పీసీఎల్​లోని ఎమ్మెస్ బ్లాక్‌లో హైడ్రోజన్ పైప్‌లీక్ కావడంతో మంటలు చెలరేగాయని సంస్థ యాజమాన్యం తెలిపింది. అత్యవసర సైరన్ ఐదుసార్లు మోగటంతో పరిసర ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందారు. మంటలను అదుపు చేసిన వెంటనే క్లియరెన్స్‌ సైరన్‌ మోగించటంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

విశాఖ హెచ్​పీసీఎల్​లో అగ్నిప్రమాదం జరిగింది. అధికారులు సకాలంలో సైరన్‌ మోగించి అందరినీ అప్రమత్తం చేయటంతో పెనుముప్పు తప్పింది. హుటాహుటిన కార్మికులను అక్కడి నుంచి దూరంగా పంపించేశారు. సీఐఎస్​ఎఫ్​, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు.

హెచ్​పీసీఎల్​లోని ఎమ్మెస్ బ్లాక్‌లో హైడ్రోజన్ పైప్‌లీక్ కావడంతో మంటలు చెలరేగాయని సంస్థ యాజమాన్యం తెలిపింది. అత్యవసర సైరన్ ఐదుసార్లు మోగటంతో పరిసర ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందారు. మంటలను అదుపు చేసిన వెంటనే క్లియరెన్స్‌ సైరన్‌ మోగించటంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

ఇదీ చదవండి

రూ.850 కోట్ల విలువైన గంజాయిని దహనం చేసిన పోలీసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.