ETV Bharat / city

మరింత తీవ్రంగా మారిన వాయుగుండం.. కోస్తా, సీమపై ప్రభావం

author img

By

Published : Nov 24, 2020, 8:00 AM IST

Updated : Nov 24, 2020, 5:06 PM IST

ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం మరింత తీవ్రంగా మారిందని వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 24 గంటల్లో తీవ్ర తుపానుగా మారనుందని హెచ్చరించింది. అధికారులు ముంపు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.

cyclone in bay of bengal
cyclone in bay of bengal
మరింత తీవ్రంగా మారిన వాయుగుండం.. కోస్తా, సీమపై ప్రభావం

ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం మరింత తీవ్రంగా మారి తుపానుగా బలపడింది. పుదుచ్చేరికి తూర్పు ఆగ్నేయంగా 410 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. చెన్నైకు ఆగ్నేయంగా 450 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. రాగల 24 గంటల్లో మరింత బలపడి తీవ్ర తుపానుగా మారుతుందని ఐఎండీ స్పష్టం చేసింది.

దక్షిణ కోస్తా, రాయలసీమ, తెలంగాణపై ప్రభావం

తుపాను ప్రభావంతో దక్షిణ కోస్తాంధ్రాలోని నెల్లూరు, రాయలసీమలోని.. చిత్తూరు తదితర ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని తెలిపింది. తీరం వెంబడి ఉన్న జిల్లాలను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరికలు జారీచేసింది.

26 నుంచి తెలంగాణలోనూ భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్టు తెలిపింది. కడలూర్‌, విల్లుపురం, పుదుచ్చేరి ప్రాంతాల్లోకి సముద్రపునీరు చొచ్చుకెళ్లే అవకాశం ఉందని పేర్కొంది. తమిళనాడు తీరప్రాంతాల్లో ముందు జాగ్రత్త చర్యగా.. తమిళనాడులో 2 కోస్ట్‌గార్డ్ నౌకలు, ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు మోహరించారు. ముంపు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి

తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్రపతి

మరింత తీవ్రంగా మారిన వాయుగుండం.. కోస్తా, సీమపై ప్రభావం

ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం మరింత తీవ్రంగా మారి తుపానుగా బలపడింది. పుదుచ్చేరికి తూర్పు ఆగ్నేయంగా 410 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. చెన్నైకు ఆగ్నేయంగా 450 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. రాగల 24 గంటల్లో మరింత బలపడి తీవ్ర తుపానుగా మారుతుందని ఐఎండీ స్పష్టం చేసింది.

దక్షిణ కోస్తా, రాయలసీమ, తెలంగాణపై ప్రభావం

తుపాను ప్రభావంతో దక్షిణ కోస్తాంధ్రాలోని నెల్లూరు, రాయలసీమలోని.. చిత్తూరు తదితర ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని తెలిపింది. తీరం వెంబడి ఉన్న జిల్లాలను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరికలు జారీచేసింది.

26 నుంచి తెలంగాణలోనూ భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్టు తెలిపింది. కడలూర్‌, విల్లుపురం, పుదుచ్చేరి ప్రాంతాల్లోకి సముద్రపునీరు చొచ్చుకెళ్లే అవకాశం ఉందని పేర్కొంది. తమిళనాడు తీరప్రాంతాల్లో ముందు జాగ్రత్త చర్యగా.. తమిళనాడులో 2 కోస్ట్‌గార్డ్ నౌకలు, ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు మోహరించారు. ముంపు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి

తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్రపతి

Last Updated : Nov 24, 2020, 5:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.