ETV Bharat / city

కోస్ట్​గార్డు, డిఆర్​ఐ జాయింట్ ఆపరేషన్..9కిలోల బంగారం స్వాధీనం

author img

By

Published : Dec 11, 2020, 7:57 PM IST

స్మగ్లింగ్ నిరోధానికి తమిళనాడులో కోస్ట్​గార్డు, డిఆర్​ఐ సంయుక్త ఆపరేషన్ చేపట్టాయి. 9 కిలోల బంగారం, ఐదుగురు జాలర్లను పట్టుకున్నామని కోస్ట్​గార్డు విశాఖ కార్యాలయం తెలిపింది. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ నాలుగున్నర కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని సమాచారం.

Coast Guard, DRI Joint Operation to Prevent Smuggling
స్మగ్లింగ్ నిరోధానికి కోస్ట్​గార్డు, డిఆర్​ఐ జాయింట్ ఆపరేషన్

స్మగ్లింగ్ నిరోధానికి తమిళనాడులో కోస్ట్​గార్డు, డిఆర్​ఐ సంయుక్త ఆపరేషన్ నిర్వహించాయి. తొమ్మిది కిలోల బంగారాన్ని, ఐదుగురు జాలర్లను పట్టుకున్నామని కోస్ట్​గార్డు విశాఖ కార్యాలయం వెల్లడించింది. తమిళనాడులోని మండపం వద్ద సెయిలర్ ఫిషింగ్ బోట్​లో ఇంజిన్ రూంలో ఓ గుడ్డ సంచిలో బంగారాన్ని దాచి ఉంచి అక్రమ రవాణా చేస్తున్నట్టు గుర్తించినట్టు తెలిపింది. ఐదుగురు మత్స్యకారులు, పట్టుకున్న వస్తువులను మరింత లోతైన విచారణ కోసం డిఆర్ఐకి అప్పగించామని కోస్ట్​గార్డు వివరించింది. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ నాలుగున్నర కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని సమాచారం.

శ్రీలంక నుంచి సముద్ర మార్గం ద్వారా బంగారం అక్రమ రవాణా జరుగుతున్నట్టు సమాచారం అందుకున్న రెవెన్యూ ఇంటెలిజెన్స్ విభాగం.. కోస్ట్​గార్డు అధికారులతో కలిసి అక్రమ బంగారం రవాణా చేస్తున్న చేపల బోటు ఆచూకీ సముద్రంలో కనిపెట్టింది. తమిళనాడులోని మండపం తీరానికి సమీపంగా ఈ బోటు చిక్కింది. ఈ ఏడాది మార్చినెలలో తమిళనాడు రామేశ్వరం వద్ద ఇదే తరహాలో శ్రీలంక నుంచి చేపల బోట్​లో 15 కిలోల బంగారం అక్రమంగా తరలిస్తుండగా పట్టుకున్న విషయాన్ని కోస్ట్​గార్డు వెల్లడించింది.

స్మగ్లింగ్ నిరోధానికి తమిళనాడులో కోస్ట్​గార్డు, డిఆర్​ఐ సంయుక్త ఆపరేషన్ నిర్వహించాయి. తొమ్మిది కిలోల బంగారాన్ని, ఐదుగురు జాలర్లను పట్టుకున్నామని కోస్ట్​గార్డు విశాఖ కార్యాలయం వెల్లడించింది. తమిళనాడులోని మండపం వద్ద సెయిలర్ ఫిషింగ్ బోట్​లో ఇంజిన్ రూంలో ఓ గుడ్డ సంచిలో బంగారాన్ని దాచి ఉంచి అక్రమ రవాణా చేస్తున్నట్టు గుర్తించినట్టు తెలిపింది. ఐదుగురు మత్స్యకారులు, పట్టుకున్న వస్తువులను మరింత లోతైన విచారణ కోసం డిఆర్ఐకి అప్పగించామని కోస్ట్​గార్డు వివరించింది. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ నాలుగున్నర కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని సమాచారం.

శ్రీలంక నుంచి సముద్ర మార్గం ద్వారా బంగారం అక్రమ రవాణా జరుగుతున్నట్టు సమాచారం అందుకున్న రెవెన్యూ ఇంటెలిజెన్స్ విభాగం.. కోస్ట్​గార్డు అధికారులతో కలిసి అక్రమ బంగారం రవాణా చేస్తున్న చేపల బోటు ఆచూకీ సముద్రంలో కనిపెట్టింది. తమిళనాడులోని మండపం తీరానికి సమీపంగా ఈ బోటు చిక్కింది. ఈ ఏడాది మార్చినెలలో తమిళనాడు రామేశ్వరం వద్ద ఇదే తరహాలో శ్రీలంక నుంచి చేపల బోట్​లో 15 కిలోల బంగారం అక్రమంగా తరలిస్తుండగా పట్టుకున్న విషయాన్ని కోస్ట్​గార్డు వెల్లడించింది.

ఇదీ చదవండీ.. భారీగా మాదక ద్రవ్యాలు స్వాధీనం చేసుకున్న భారత కోస్ట్ గార్డు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.