ETV Bharat / city

పుల్వామా దాడిలో మృతులకు భారతీయ జనతా యువ మోర్చా నివాళులు - పుల్వామా మృతులకు నివాళిగా విశాఖలో ర్యాలీ నిర్వహించిన భారతీయ జనతా యువ మోర్చా

పుల్వామా దాడిలో మృతి చెందిన సీఆర్పీఎఫ్ జవాన్లకు భారతీయ జనతా యువ మోర్చా సభ్యులు నివాళులర్పించారు. విశాఖ సాగర తీరంలోని 'విక్టరీ ఎట్ సీ' వద్ద నుంచి ర్యాలీ నిర్వహించి.. దేశ భక్తి పట్ల యువతకు అవగాహన కల్పించారు.

bharatiya janatha yuva morcha tributes to died crpf persons at pulwama attack in visakha
పుల్వామా దాడిలో మృతులకు భారతీయ జనతా యువ మోర్చా విశాఖలో నివాళులు
author img

By

Published : Feb 14, 2021, 8:26 PM IST

'భారత్ మాతాకీ జై! మాతరం మాతరం వందేమాతరం!' అని నినాదాలు చేస్తూ.. భారతీయ జనతా యువమోర్చా కార్యకర్తలు విశాఖ సాగరతీరంలో ర్యాలీ నిర్వహించారు. పుల్వామా దాడిలో మృతి చెందిన సీఆర్పీఎఫ్ జవాన్లకు నివాళులు సమర్పించారు. వాలంటైన్స్ డే సందర్భంగా యువత విదేశీ పోకడలకు ఆకర్షితులు కాకుండా.. దేశభక్తిని పెంపొందించుకోవాలని యువమోర్చా జిల్లా అధ్యక్షుడు కాళ్ల అశోక్ కుమార్ విజ్ఞప్తి చేశారు. నగర భాజపా అధ్యక్షుడు రవీందర్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

'భారత్ మాతాకీ జై! మాతరం మాతరం వందేమాతరం!' అని నినాదాలు చేస్తూ.. భారతీయ జనతా యువమోర్చా కార్యకర్తలు విశాఖ సాగరతీరంలో ర్యాలీ నిర్వహించారు. పుల్వామా దాడిలో మృతి చెందిన సీఆర్పీఎఫ్ జవాన్లకు నివాళులు సమర్పించారు. వాలంటైన్స్ డే సందర్భంగా యువత విదేశీ పోకడలకు ఆకర్షితులు కాకుండా.. దేశభక్తిని పెంపొందించుకోవాలని యువమోర్చా జిల్లా అధ్యక్షుడు కాళ్ల అశోక్ కుమార్ విజ్ఞప్తి చేశారు. నగర భాజపా అధ్యక్షుడు రవీందర్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిర్ణయం... ఆర్.నారాయణమూర్తి ఆగ్రహం

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.