ETV Bharat / city

YS Sharmila: 'రాజన్న రాజ్య స్థాపనే ధ్యేయం.. జులై 8న పార్టీ ప్రకటన'

తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకుడిని తీసుకువచ్చి.. టీపీసీసీ అధ్యక్షుడిని చేసే దుస్థితికి కాంగ్రెస్‌ చేరిందని వైఎస్​ షర్మిల విమర్శించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు జులై 8న వైఎస్సార్​ జయంతి సందర్భంగా.. రాష్ట్రంలో కొత్త పార్టీ ఏర్పాటు చేయనున్నట్లు షర్మిల తెలిపారు.

author img

By

Published : Jun 30, 2021, 3:37 PM IST

YS Sharmila
YS Sharmila

రాజన్న రాజ్య స్థాపనే ధ్యేయంగా తెలంగాణలో వైఎస్‌ఆర్‌టీపీ ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. వైఎస్‌ఆర్‌టీపీ అధికారంలోకి వస్తే విద్య, వైద్యం అన్నీ ఉచితమని షర్మిల ప్రకటించారు.

హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లో 'టీమ్‌ వైస్​ఎస్సార్​' వెబ్‌సైట్​ను షర్మిల ప్రారంభించారు. ప్రజాస్వామ్యంలో ఉన్న నాలుగుస్తంభాల్లో ఏ ఒక్క వ్యవస్థ సరిగ్గా పని చేయకపోయినా.. ప్రశ్నించి సరైన మార్గంలో పెట్టేలా చేసే ఐదో స్తంభంగా సోషల్​ మీడియా మారిందని షర్మిల అభిప్రాయపడ్డారు. సామాజిక మాధ్యమం ప్రజల చేతుల్లో ఉన్న ఆయుధంగా ఆమె అభివర్ణించారు.

తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకుడిని తీసుకువచ్చి.. టీపీసీసీ అధ్యక్షుడిని చేసే దుస్థితికి కాంగ్రెస్‌ చేరిందని వైఎస్​ షర్మిల విమర్శించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు జులై 8న వైఎస్సార్​ జయంతి సందర్భంగా.. రాష్ట్రంలో కొత్త పార్టీ ఏర్పాటు చేయనున్నట్లు షర్మిల తెలిపారు.

ప్రజల గొంతు నేరుగా వినిపించేందుకు సోషల్​ మీడియానే సరైన వేదికగా మారుతోందన్నారు. ప్రత్యేక ఉద్యోగులతో తెరాస, కాంగ్రెస్‌ పార్టీలు సోషల్‌ మీడియాను నడుపుతున్నాయన్నారు. తమ పార్టీకి సోషల్​ మీడియా ఎంప్లాయిస్​ ఉండరని.. వైఎస్​ అభిమానులే వారియర్స్‌గా ఉంటారని పేర్కొన్నారు.

రాజన్న రాజ్య స్థాపనే ధ్యేయంగా తెలంగాణలో వైఎస్‌ఆర్‌టీపీ ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. వైఎస్‌ఆర్‌టీపీ అధికారంలోకి వస్తే విద్య, వైద్యం అన్నీ ఉచితమని షర్మిల ప్రకటించారు.

హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లో 'టీమ్‌ వైస్​ఎస్సార్​' వెబ్‌సైట్​ను షర్మిల ప్రారంభించారు. ప్రజాస్వామ్యంలో ఉన్న నాలుగుస్తంభాల్లో ఏ ఒక్క వ్యవస్థ సరిగ్గా పని చేయకపోయినా.. ప్రశ్నించి సరైన మార్గంలో పెట్టేలా చేసే ఐదో స్తంభంగా సోషల్​ మీడియా మారిందని షర్మిల అభిప్రాయపడ్డారు. సామాజిక మాధ్యమం ప్రజల చేతుల్లో ఉన్న ఆయుధంగా ఆమె అభివర్ణించారు.

తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకుడిని తీసుకువచ్చి.. టీపీసీసీ అధ్యక్షుడిని చేసే దుస్థితికి కాంగ్రెస్‌ చేరిందని వైఎస్​ షర్మిల విమర్శించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు జులై 8న వైఎస్సార్​ జయంతి సందర్భంగా.. రాష్ట్రంలో కొత్త పార్టీ ఏర్పాటు చేయనున్నట్లు షర్మిల తెలిపారు.

ప్రజల గొంతు నేరుగా వినిపించేందుకు సోషల్​ మీడియానే సరైన వేదికగా మారుతోందన్నారు. ప్రత్యేక ఉద్యోగులతో తెరాస, కాంగ్రెస్‌ పార్టీలు సోషల్‌ మీడియాను నడుపుతున్నాయన్నారు. తమ పార్టీకి సోషల్​ మీడియా ఎంప్లాయిస్​ ఉండరని.. వైఎస్​ అభిమానులే వారియర్స్‌గా ఉంటారని పేర్కొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.