ETV Bharat / city

విజయవాడ గ్యాంగ్​ వార్ కేసులో కీలక నిందితులు అరెస్టు

author img

By

Published : Jun 8, 2020, 3:16 PM IST

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం స్పష్టించిన విజయవాడ గ్యాంగ్ ​వార్​ కేసులో మరికొంత మంది నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరంతా సందీప్ అనుచరులని డీసీపీ హర్షవర్ధన్ వెల్లడించారు. సందీప్ గ్యాంగ్​లోని‌ ఓ వ్యక్తి తొందరపాటు వల్లే గొడవ జరిగిందని తెలిపారు.

vijayawada police arrested sandeep gang in gang war cases
vijayawada police arrested sandeep gang in gang war cases

విజయవాడ గ్యాంగ్‌ వార్‌ కేసు దర్యాప్తును పోలీసులు మరింత ముమ్మరం చేశారు. రెండ్రోజుల క్రితం పండు గ్యాంగ్​లో 13 మందిని అరెస్టు చేసిన పోలీసులు.... తాజాగా సందీప్ గ్యాంగ్​లోని 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టైన వారిలో మృతుడు సందీప్ సోదరుడు జగదీష్, మంగళగిరికి చెందిన ఇద్దరు రౌడీషీటర్లు కూడా ఉన్నారని డీసీపీ హర్షవర్ధన్ వెల్లడించారు. రెండు గ్యాంగ్‌లలో ఉన్న మరికొంతమంది కోసం గాలిస్తున్నామని తెలిపారు. సందీప్ గ్యాంగ్​లోని‌ కిరణ్‌కుమార్ తొందరపాటు వల్లే గొడవ జరిగిందని డీసీపీ వివరించారు.

అపార్టుమెంట్‌ సెటిల్‌మెంట్‌ విషయంలో ప్రమేయం ఉన్న వారిపై విచారణ జరుపుతున్నామని డీసీపీ వెల్లడించారు. అపార్టుమెంట్‌ సెటిల్‌మెంట్‌ గొడవ, గ్యాంగ్‌వార్‌పై వేర్వేరుగా కేసులు నమోదు చేశామన్నారు. పండు తల్లి పాత్రపై కూడా విచారణ జరుపుతున్నామని తెలిపారు. గంజాయి అమ్మకాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామన్నారు.

మరోవైపు.. గుంటూరు సర్వజన ఆసుపత్రిలో పటిష్ట పోలీసు బందోబస్తు మధ్య పండు చికిత్స పొందుతున్నాడు. వైద్యులు, సిబ్బందిని తప్ప ఎవరినీ లోనికి అనుమతించటం లేదు. గాయాల నుంచి కోలుకుంటే పండును మంగళవారం డిశ్ఛార్జి చేసే అవకాశముంది.

విజయవాడ గ్యాంగ్‌ వార్‌ కేసు దర్యాప్తును పోలీసులు మరింత ముమ్మరం చేశారు. రెండ్రోజుల క్రితం పండు గ్యాంగ్​లో 13 మందిని అరెస్టు చేసిన పోలీసులు.... తాజాగా సందీప్ గ్యాంగ్​లోని 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టైన వారిలో మృతుడు సందీప్ సోదరుడు జగదీష్, మంగళగిరికి చెందిన ఇద్దరు రౌడీషీటర్లు కూడా ఉన్నారని డీసీపీ హర్షవర్ధన్ వెల్లడించారు. రెండు గ్యాంగ్‌లలో ఉన్న మరికొంతమంది కోసం గాలిస్తున్నామని తెలిపారు. సందీప్ గ్యాంగ్​లోని‌ కిరణ్‌కుమార్ తొందరపాటు వల్లే గొడవ జరిగిందని డీసీపీ వివరించారు.

అపార్టుమెంట్‌ సెటిల్‌మెంట్‌ విషయంలో ప్రమేయం ఉన్న వారిపై విచారణ జరుపుతున్నామని డీసీపీ వెల్లడించారు. అపార్టుమెంట్‌ సెటిల్‌మెంట్‌ గొడవ, గ్యాంగ్‌వార్‌పై వేర్వేరుగా కేసులు నమోదు చేశామన్నారు. పండు తల్లి పాత్రపై కూడా విచారణ జరుపుతున్నామని తెలిపారు. గంజాయి అమ్మకాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామన్నారు.

మరోవైపు.. గుంటూరు సర్వజన ఆసుపత్రిలో పటిష్ట పోలీసు బందోబస్తు మధ్య పండు చికిత్స పొందుతున్నాడు. వైద్యులు, సిబ్బందిని తప్ప ఎవరినీ లోనికి అనుమతించటం లేదు. గాయాల నుంచి కోలుకుంటే పండును మంగళవారం డిశ్ఛార్జి చేసే అవకాశముంది.

ఇదీ చదవండి:

ఇంజినీరింగ్ విద్యార్థుల మధ్య వార్! అడ్డుకున్న పోలీసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.