ఈనెల 14న విజయవాడ మొగల్రాజపురంలోని వైద్యుడు మురళీధర్ ఇంట్లో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. 48.50 లక్షల రూపాయల నగదు చోరీ జరిగిందని వైద్యుడు మురళీధర్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు నగర సీపీ బి.శ్రీనివాసులు మీడియాకు తెలిపారు. ఈ కేసులో మొత్తం 8 మంది నిందితులున్నారన్న సీపీ... క్యాటరింగ్ నాగేంద్ర, పీఆర్వో మెండెం విజయ్, తాడేపల్లికి చెందిన నేరస్థులతో కలిసి దోపిడికి పాల్పడినట్లు సీపీ తెలిపారు.
ఈ కేసులో ఇప్పటికే ఐదుగురిని అరెస్టు చేసినట్లు సీపీ వెల్లడించారు. 34.75 లక్షల రూపాయల నగదు, 48 గ్రాముల బంగారం రికవరీ చేసినట్లు నగర కమిషర్ తెలిపారు. చోరీ చేసిన వారిలో వెస్లీ అనే వ్యక్తికి నేర చరిత్ర ఉందన్నారు. ప్రతీ నెల లక్షల్లో బ్యాంకు ఈఎంఐలు కట్టాలని డాక్టర్ తెలిపినట్లు సీపీ తెలిపారు. మొత్తం బిల్డింగ్ మరమ్మత్తులు జరిగిన తరువాత.. సీసీ కెమెరాలు పెట్టాలని అనుకున్నారని సీపీ తెలిపారు. దోపిడీ చేసే సమయంలో నిందితులు ఆసుపత్రిలో తమ బంధువుల చికిత్స కోసం రూ.20 లక్షలు కట్టామని డాక్టర్ భార్యతో చెప్పారని అన్నారు. పీఆర్వోనే ముందుగా డాక్టర్ భార్యను ఎవరో బయట అనుమానాస్పదంగా తిరుగుతున్నారని అలర్ట్ చేశారని సీపీ వివరించారు.
ఇదీ చదవండీ...అమరావతే ఆశగా... రాజధాని సాధనే శ్వాసగా రైతుల ఉద్యమం