ETV Bharat / city

'పదిరోజుల్లో 50 వేల మందికి కరోనా పరీక్షలు​'

author img

By

Published : Jun 15, 2020, 8:20 AM IST

హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాబోయే వారం, పది రోజుల్లో.. 5 జిల్లాల పరిధిలో 50 వేల మందికి కరోనా పరీక్షలు నిర్వహించాలని.. తెలంగాణ సీఎం కేసీఆర్​ ఆదేశించారు. 30 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో.. వైరస్‌ నిర్ధరణ పరీక్షలు చేపట్టాలన్నారు. అందుకోసం ప్రైవేటు ల్యాబ్‌లు, ఆస్పత్రులను వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

Tg_Hyd_47_14_Govt_On_Carona_Pkg_3053262
Tg_Hyd_47_14_Govt_On_Carona_Pkg_3053262

హైదరాబాద్​ను కాపాడుకోవాలనే ముందు చూపుతో 50 వేల మందికి పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించాం. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కాకపోతే ఎవరికి వారు వ్యక్తిగత జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా వృద్ధులు ఇంట్లోనే ఉండాలి. ఇతర తీవ్ర జబ్బలు ఉన్నవారు కూడా జాగ్రత్తగా ఉండటం అవసరం :- తెలంగాణ సీఎం కేసీఆర్

జీహెచ్​ఎంసీ సహా హైదరాబాద్ చుట్టపక్కల ప్రాంతాల్లో.. కరోనా వైరస్ వ్యాప్తిపై ప్రభుత్వం కట్టుదిట్టంగా చర్యలు ప్రారంభించనుంది. రాబోయే వారం, పది రోజుల్లో హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్... మేడ్చల్, సంగారెడ్డి జిల్లాలకు చెందిన 30 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో.. 50 వేల మందికి ముందు జాగ్రత్త చర్యగా కరోనా వైరస్ నిర్ధరణ పరీక్షలు నిర్వహించనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు.

నివారణ చర్యలపై..

కరోనా వ్యాప్తి నివారణ చర్యలపై సీఎం కేసీఆర్ ప్రగతిభవన్​లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, సీనియర్ వైద్యాధికారులు సమావేశంలో పాల్గొన్నారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో వైరస్ వ్యాప్తి తక్కువగానే ఉందని అధికారులు వివరించారు. మరణాల రేటు తక్కువగానూ, కోలుకుంటున్నవారి సంఖ్య చాలా ఎక్కువగానూ నమోదవుతుందని వారు చెప్పారు. అయితే, రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలతో పోల్చుకుంటే.. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో ఎక్కువగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయని అన్నారు. ఆ తర్వాత స్థానంలో సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలున్నాయని వెల్లడించారు. హైదరాబాద్, దాని చుట్టుపక్కల ఉన్న ఇతర నాలుగు జిల్లాలపై మరింత దృష్టి పెట్టాలన్నారు. ఈ ఐదు జిల్లాల పరిధిలోని 30 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు.

వ్యాప్తి జరగకుండా..

హైదరాబాద్ ప్రజల ఆరోగ్యం, నగర ప్రగతి, నగర పేరు ప్రఖ్యాతులు.. సుస్థిరంగా ఉండేటట్లు చూడాల్సిన బాధ్యత మనపై ఉందని కేసీఆర్ పేర్కొన్నారు. వారం, పది రోజుల్లో వైరస్ వ్యాప్తి జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. హైదరాబాద్, చుట్టుపక్కల జిల్లాల్లోని ఉప్పల్, ఎల్​బీ నగర్, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, రాజేంద్రనగర్, శేర్​లింగంపల్లి, చేవెళ్ల, పరిగి, వికారాబాద్, తాండూర్, మేడ్చల్, మల్కాజిగిరి, కుత్బుల్లాపూర్, కూకట్​పల్లి, మలక్​పేట్, అంబర్​పేట్, ముషీరాబాద్, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, సనత్ నగర్, నాంపల్లి, కార్వాన్, గోషామహల్, చార్మినార్, చాంద్రాయణ గుట్ట, యాకుత్​పుర, బహదూర్​పుర, సికింద్రాబాద్ కంటోన్మెంట్, పటాన్​చెరు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని 50 వేల మందికి వైరస్ నిర్ధరణ పరీక్షలు నిర్వహించాలని సీఎం స్పష్టం చేశారు. ఇందు కోసం ప్రభుత్వ ఆస్పత్రులనే కాకుండా, ప్రైవేటు లాబరేటరీలు... ఆస్పత్రులను కూడా వినియోగించుకోవాలన్నారు. ప్రైవేటు హాస్పిటళ్లలో జరిపే పరీక్షలు, చికిత్సకు అవసరమైన మార్గదర్శకాలను.. ధరలను అధికారులు నిర్ణయించాలని ఆదేశించారు. పాజిటివ్​గా తేలినప్పటికీ.. వ్యాధి లక్షణాలు తీవ్రంగా లేనివారికి ఇంట్లోనే ఉంచి చికిత్స అందించాలని ముఖ్యమంత్రి సూచించారు.

అందరికీ చికిత్స..

తెలంగాణలో ఎంత మందికి పాజిటివ్ వచ్చినప్పటికీ అందరికీ చికిత్స అందించడానికి ప్రభుత్వం సర్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. టెస్టు కిట్లు, పీపీఈ కిట్లు, ఎన్-95 మాస్కులు, పడకలు, ఐసీయూ బెడ్లు, వెంటిలేటర్లు ఇలా ప్రతి విషయంలోనూ.. ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కాబట్టి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి వెల్లడించారు. రాష్ట్రంలో వైరస్ వ్యాప్తిని నివారించడానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు, వైరస్ సోకినవారికి అవసరమైన చికిత్స అందించే విషయంలో ప్రభుత్వం పూర్తి చిత్తశుద్ధితో అప్రమత్తతతో ఉందని సీఎం కేసీఆర్ ప్రకటించారు.


ఇదీ చూడండి : ఇసుక మాయంలో మంత్రిని ఎందుకు అరెస్టు చేయరు..?: చంద్రబాబు

హైదరాబాద్​ను కాపాడుకోవాలనే ముందు చూపుతో 50 వేల మందికి పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించాం. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కాకపోతే ఎవరికి వారు వ్యక్తిగత జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా వృద్ధులు ఇంట్లోనే ఉండాలి. ఇతర తీవ్ర జబ్బలు ఉన్నవారు కూడా జాగ్రత్తగా ఉండటం అవసరం :- తెలంగాణ సీఎం కేసీఆర్

జీహెచ్​ఎంసీ సహా హైదరాబాద్ చుట్టపక్కల ప్రాంతాల్లో.. కరోనా వైరస్ వ్యాప్తిపై ప్రభుత్వం కట్టుదిట్టంగా చర్యలు ప్రారంభించనుంది. రాబోయే వారం, పది రోజుల్లో హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్... మేడ్చల్, సంగారెడ్డి జిల్లాలకు చెందిన 30 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో.. 50 వేల మందికి ముందు జాగ్రత్త చర్యగా కరోనా వైరస్ నిర్ధరణ పరీక్షలు నిర్వహించనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు.

నివారణ చర్యలపై..

కరోనా వ్యాప్తి నివారణ చర్యలపై సీఎం కేసీఆర్ ప్రగతిభవన్​లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, సీనియర్ వైద్యాధికారులు సమావేశంలో పాల్గొన్నారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో వైరస్ వ్యాప్తి తక్కువగానే ఉందని అధికారులు వివరించారు. మరణాల రేటు తక్కువగానూ, కోలుకుంటున్నవారి సంఖ్య చాలా ఎక్కువగానూ నమోదవుతుందని వారు చెప్పారు. అయితే, రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలతో పోల్చుకుంటే.. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో ఎక్కువగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయని అన్నారు. ఆ తర్వాత స్థానంలో సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలున్నాయని వెల్లడించారు. హైదరాబాద్, దాని చుట్టుపక్కల ఉన్న ఇతర నాలుగు జిల్లాలపై మరింత దృష్టి పెట్టాలన్నారు. ఈ ఐదు జిల్లాల పరిధిలోని 30 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు.

వ్యాప్తి జరగకుండా..

హైదరాబాద్ ప్రజల ఆరోగ్యం, నగర ప్రగతి, నగర పేరు ప్రఖ్యాతులు.. సుస్థిరంగా ఉండేటట్లు చూడాల్సిన బాధ్యత మనపై ఉందని కేసీఆర్ పేర్కొన్నారు. వారం, పది రోజుల్లో వైరస్ వ్యాప్తి జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. హైదరాబాద్, చుట్టుపక్కల జిల్లాల్లోని ఉప్పల్, ఎల్​బీ నగర్, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, రాజేంద్రనగర్, శేర్​లింగంపల్లి, చేవెళ్ల, పరిగి, వికారాబాద్, తాండూర్, మేడ్చల్, మల్కాజిగిరి, కుత్బుల్లాపూర్, కూకట్​పల్లి, మలక్​పేట్, అంబర్​పేట్, ముషీరాబాద్, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, సనత్ నగర్, నాంపల్లి, కార్వాన్, గోషామహల్, చార్మినార్, చాంద్రాయణ గుట్ట, యాకుత్​పుర, బహదూర్​పుర, సికింద్రాబాద్ కంటోన్మెంట్, పటాన్​చెరు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని 50 వేల మందికి వైరస్ నిర్ధరణ పరీక్షలు నిర్వహించాలని సీఎం స్పష్టం చేశారు. ఇందు కోసం ప్రభుత్వ ఆస్పత్రులనే కాకుండా, ప్రైవేటు లాబరేటరీలు... ఆస్పత్రులను కూడా వినియోగించుకోవాలన్నారు. ప్రైవేటు హాస్పిటళ్లలో జరిపే పరీక్షలు, చికిత్సకు అవసరమైన మార్గదర్శకాలను.. ధరలను అధికారులు నిర్ణయించాలని ఆదేశించారు. పాజిటివ్​గా తేలినప్పటికీ.. వ్యాధి లక్షణాలు తీవ్రంగా లేనివారికి ఇంట్లోనే ఉంచి చికిత్స అందించాలని ముఖ్యమంత్రి సూచించారు.

అందరికీ చికిత్స..

తెలంగాణలో ఎంత మందికి పాజిటివ్ వచ్చినప్పటికీ అందరికీ చికిత్స అందించడానికి ప్రభుత్వం సర్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. టెస్టు కిట్లు, పీపీఈ కిట్లు, ఎన్-95 మాస్కులు, పడకలు, ఐసీయూ బెడ్లు, వెంటిలేటర్లు ఇలా ప్రతి విషయంలోనూ.. ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కాబట్టి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి వెల్లడించారు. రాష్ట్రంలో వైరస్ వ్యాప్తిని నివారించడానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు, వైరస్ సోకినవారికి అవసరమైన చికిత్స అందించే విషయంలో ప్రభుత్వం పూర్తి చిత్తశుద్ధితో అప్రమత్తతతో ఉందని సీఎం కేసీఆర్ ప్రకటించారు.


ఇదీ చూడండి : ఇసుక మాయంలో మంత్రిని ఎందుకు అరెస్టు చేయరు..?: చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.