ETV Bharat / city

Justice N. V. Ramana: కోర్టుకు రావడం.. ఆఖరి ప్రత్యామ్నాయం కావాలి : సీజేఐ

author img

By

Published : Dec 4, 2021, 12:31 PM IST

Updated : Dec 4, 2021, 2:42 PM IST

Justice N. V. Ramana: కోర్టుకు రావడమనేది ఆఖరి ప్రత్యామ్నాయం కావాలని సీజేఐ జస్టిస్ ఎన్.వి. రమణ అభిప్రాయపడ్డారు. కోర్టులకు వచ్చేముందే తక్కువ సమయంలో మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కారాలు చేసుకోవచ్చని సూచించారు. హైదరాబాద్​లో జరిగిన అంతర్జాతీయ ఆర్బిట్రేషన్, మీడియేషన్ కేంద్రం సన్నాహక సదస్సులో జస్టిస్ ఎన్.వి. రమణ పాల్గొన్నారు.

Justice N. V. Ramana
Justice N. V. Ramana

Justice N. V. Ramana : అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కేంద్రం ఏర్పాటుకు హైదరాబాద్‌ సరైన వేదిక అని సీజేఐ జస్టిస్ ఎన్.వి. రమణ అన్నారు. మధ్యవర్తిత్వం ద్వారానే కేసుల పరిష్కారం మేలని పేర్కొన్నారు. కోర్టులకు వచ్చేముందే తక్కువ సమయంలో మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కారాలు చేసుకోవచ్చునని సూచించారు. ఆస్తుల పంపకాలను కుటుంబసభ్యులు సామరస్యంగా పరిష్కరించుకోవాలని.. మహిళలు సాధ్యమైనంత వరకు మధ్యవర్తిత్వంతో వివాదాలు పరిష్కరించుకోవాలని చెప్పారు. మహాభారతంలోనూ మధ్యవర్తిత్వం ప్రస్తావన ఉందని వెల్లడించారు. హైదరాబాద్​లో రూపుదిద్దుకుంటున్న అంతర్జాతీయ ఆర్బిట్రేషన్, మీడియేషన్ కేంద్రం.. ఐఏఎంసీ నేటి సన్నాహక సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ నెల 18న హైదరాబాద్‌లో ఐఏఎంసీ ప్రారంభం కానున్నట్లు సీజేఐ వెల్లడించారు.

చివరి ప్రయత్నంగానే కోర్టుకు రావాలి..
IAMC conference 2021 : కోర్టుకు రావడమనేది ఆఖరి ప్రత్యామ్నాయం కావాలని సీజేఐ అభిప్రాయపడ్డారు. విస్తృత సంప్రదింపులతో ఇరుపక్షాలకు ఆమోదయోగ్య పరిష్కారం చేసుకోవచ్చునని వ్యాఖ్యానించారు. పెండింగ్‌ కేసుల సత్వర విచారణ జరగాలని చెప్పారు. సంప్రదింపుల ద్వారా సమస్యలు కొలిక్కి తీసుకోవచ్చునని పేర్కొన్నారు. ఏళ్లతరబడి కోర్టుల చుట్టూ తిరగడం వల్ల కాలయాపన జరుగుతుందని... . అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కేంద్రంతో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. పీవీ నరసింహారావు దేశంలో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారని గుర్తు చేశారు.

ఐఏఎంసీ సన్నాహక సదస్సు
Hyderabad IAMC conference : హైదరాబాద్​లో రూపుదిద్దుకుంటున్న అంతర్జాతీయ ఆర్బిట్రేషన్, మీడియేషన్ కేంద్రం... ఐఏఎంసీ సన్నాహక సదస్సు నేడు ప్రారంభమైంది. హెచ్ఐసీసీలో జరుగుతున్న సదస్సు ప్రారంభోత్సవానికి సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, సీఎం కేసీఆర్, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎల్.నాగేశ్వరరావు, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హాజరయ్యారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు అధ్యక్షోపన్యాసం చేశారు. 20 ఏళ్ల క్రితం ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్, మీడియేషన్ సెంటర్‌కు భూమి కేటాయించారని ఆయన తెలిపారు. భూమి కేటాయించినా ఆర్బిట్రేషన్, మీడియేషన్ సెంటర్‌ కార్యరూపం దాల్చలేదని వెల్లడించారు.

చర్చాగోష్ఠులు..
సదస్సు అనంతరం రెండు ప్యానెల్‌ల చర్చాగోష్ఠులు నిర్వహించనున్నారు. ప్రత్యామ్నాయ వివాదాల పరిష్కారం ప్రక్రియ, వినియోగదారుల అంచనాలు అనే అంశంపై జరిగే చర్చలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఆర్.సుభాష్ రెడ్డి, జస్టిస్ పి.ఎస్.నర్సింహా, తదితరులు పాల్గొంటారు. ఆర్బిట్రేషన్, మీడియేషన్ ఉద్దేశాలపై చర్చలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ హిమాకోహ్లి, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖర్ రెడ్డి, తదితరులు పాల్గొంటారు. ముగింపు కార్యక్రమంలో మంత్రి కేటీ రామారావు, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, ఐఏఎంసీ లైఫ్ ట్రస్టీ జస్టిస్ ఆర్.వి.రవీంద్రన్ ప్రసంగిస్తారు.

CM KCR AT IAMC Conference :
హైదరాబాద్​లో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కేంద్రం రావడం సంతోషమని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఆర్బిట్రేషన్ కేంద్రానికి హైదరాబాద్​ అన్ని విధాలా అనువైన ప్రాంతమని తెలిపారు. ఏఐఎంసీ కోసం 25వేల చదరపు అడుగులు కేటాయించినట్లు చెప్పారు. శాశ్వత భవనం కోసం పుప్పాలగూడలో త్వరలో భూమి కేటాయిస్తామని వెల్లడించారు.

IAMC Conference Today : హైదరాబాద్​లోని హెచ్‌ఐసీసీ నోవాటెల్‌లో ఏర్పాటు చేసిన ఇంటర్నేషనల్‌ ఆర్బిట్రేషన్‌, మీడియేషన్‌ సెంటర్‌ (ఐఏఎంసీ) సదస్సులో సీజేఐ జస్టిస్‌ ఎన్‌వీ రమణతో కలిసి తెలంగాణ సీఎం పాల్గొన్నారు. వీరితో పాటు సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు, తెలంగాణ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఈ సదస్సుకు హాజరయ్యారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు అధ్యక్షోపన్యాసం చేశారు. 20 ఏళ్ల క్రితం ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్, మీడియేషన్ సెంటర్‌కు భూమి కేటాయించారని ఆయన తెలిపారు. భూమి కేటాయించినా ఆర్బిట్రేషన్, మీడియేషన్ సెంటర్‌ కార్యరూపం దాల్చలేదని వెల్లడించారు

"ప్రభుత్వం, ప్రజల తరఫున సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణకు ధన్యవాదాలు. మధ్యవర్తిత్వం దేశంలో రచ్చబండ వంటి రూపాల్లో ఎప్పటి నుంచో ఉంది. పలు కారణాలతో పరిశ్రమలు వివాదాలు ఎదుర్కొంటున్నాయి. హైదరాబాద్‌లో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కేంద్రం రావటం సంతోషం. ఆర్బిట్రేషన్ కేంద్రానికి హైదరాబాద్ అన్ని విధాలా అనువైన ప్రాంతం."

- కేసీఆర్, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి

ఇదీ చదవండి: 'న్యాయ వృత్తి లాభం కోసం కాదు.. సమాజ సేవకే'

Justice N. V. Ramana : అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కేంద్రం ఏర్పాటుకు హైదరాబాద్‌ సరైన వేదిక అని సీజేఐ జస్టిస్ ఎన్.వి. రమణ అన్నారు. మధ్యవర్తిత్వం ద్వారానే కేసుల పరిష్కారం మేలని పేర్కొన్నారు. కోర్టులకు వచ్చేముందే తక్కువ సమయంలో మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కారాలు చేసుకోవచ్చునని సూచించారు. ఆస్తుల పంపకాలను కుటుంబసభ్యులు సామరస్యంగా పరిష్కరించుకోవాలని.. మహిళలు సాధ్యమైనంత వరకు మధ్యవర్తిత్వంతో వివాదాలు పరిష్కరించుకోవాలని చెప్పారు. మహాభారతంలోనూ మధ్యవర్తిత్వం ప్రస్తావన ఉందని వెల్లడించారు. హైదరాబాద్​లో రూపుదిద్దుకుంటున్న అంతర్జాతీయ ఆర్బిట్రేషన్, మీడియేషన్ కేంద్రం.. ఐఏఎంసీ నేటి సన్నాహక సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ నెల 18న హైదరాబాద్‌లో ఐఏఎంసీ ప్రారంభం కానున్నట్లు సీజేఐ వెల్లడించారు.

చివరి ప్రయత్నంగానే కోర్టుకు రావాలి..
IAMC conference 2021 : కోర్టుకు రావడమనేది ఆఖరి ప్రత్యామ్నాయం కావాలని సీజేఐ అభిప్రాయపడ్డారు. విస్తృత సంప్రదింపులతో ఇరుపక్షాలకు ఆమోదయోగ్య పరిష్కారం చేసుకోవచ్చునని వ్యాఖ్యానించారు. పెండింగ్‌ కేసుల సత్వర విచారణ జరగాలని చెప్పారు. సంప్రదింపుల ద్వారా సమస్యలు కొలిక్కి తీసుకోవచ్చునని పేర్కొన్నారు. ఏళ్లతరబడి కోర్టుల చుట్టూ తిరగడం వల్ల కాలయాపన జరుగుతుందని... . అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కేంద్రంతో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. పీవీ నరసింహారావు దేశంలో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారని గుర్తు చేశారు.

ఐఏఎంసీ సన్నాహక సదస్సు
Hyderabad IAMC conference : హైదరాబాద్​లో రూపుదిద్దుకుంటున్న అంతర్జాతీయ ఆర్బిట్రేషన్, మీడియేషన్ కేంద్రం... ఐఏఎంసీ సన్నాహక సదస్సు నేడు ప్రారంభమైంది. హెచ్ఐసీసీలో జరుగుతున్న సదస్సు ప్రారంభోత్సవానికి సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, సీఎం కేసీఆర్, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎల్.నాగేశ్వరరావు, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హాజరయ్యారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు అధ్యక్షోపన్యాసం చేశారు. 20 ఏళ్ల క్రితం ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్, మీడియేషన్ సెంటర్‌కు భూమి కేటాయించారని ఆయన తెలిపారు. భూమి కేటాయించినా ఆర్బిట్రేషన్, మీడియేషన్ సెంటర్‌ కార్యరూపం దాల్చలేదని వెల్లడించారు.

చర్చాగోష్ఠులు..
సదస్సు అనంతరం రెండు ప్యానెల్‌ల చర్చాగోష్ఠులు నిర్వహించనున్నారు. ప్రత్యామ్నాయ వివాదాల పరిష్కారం ప్రక్రియ, వినియోగదారుల అంచనాలు అనే అంశంపై జరిగే చర్చలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఆర్.సుభాష్ రెడ్డి, జస్టిస్ పి.ఎస్.నర్సింహా, తదితరులు పాల్గొంటారు. ఆర్బిట్రేషన్, మీడియేషన్ ఉద్దేశాలపై చర్చలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ హిమాకోహ్లి, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖర్ రెడ్డి, తదితరులు పాల్గొంటారు. ముగింపు కార్యక్రమంలో మంత్రి కేటీ రామారావు, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, ఐఏఎంసీ లైఫ్ ట్రస్టీ జస్టిస్ ఆర్.వి.రవీంద్రన్ ప్రసంగిస్తారు.

CM KCR AT IAMC Conference :
హైదరాబాద్​లో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కేంద్రం రావడం సంతోషమని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఆర్బిట్రేషన్ కేంద్రానికి హైదరాబాద్​ అన్ని విధాలా అనువైన ప్రాంతమని తెలిపారు. ఏఐఎంసీ కోసం 25వేల చదరపు అడుగులు కేటాయించినట్లు చెప్పారు. శాశ్వత భవనం కోసం పుప్పాలగూడలో త్వరలో భూమి కేటాయిస్తామని వెల్లడించారు.

IAMC Conference Today : హైదరాబాద్​లోని హెచ్‌ఐసీసీ నోవాటెల్‌లో ఏర్పాటు చేసిన ఇంటర్నేషనల్‌ ఆర్బిట్రేషన్‌, మీడియేషన్‌ సెంటర్‌ (ఐఏఎంసీ) సదస్సులో సీజేఐ జస్టిస్‌ ఎన్‌వీ రమణతో కలిసి తెలంగాణ సీఎం పాల్గొన్నారు. వీరితో పాటు సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు, తెలంగాణ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఈ సదస్సుకు హాజరయ్యారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు అధ్యక్షోపన్యాసం చేశారు. 20 ఏళ్ల క్రితం ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్, మీడియేషన్ సెంటర్‌కు భూమి కేటాయించారని ఆయన తెలిపారు. భూమి కేటాయించినా ఆర్బిట్రేషన్, మీడియేషన్ సెంటర్‌ కార్యరూపం దాల్చలేదని వెల్లడించారు

"ప్రభుత్వం, ప్రజల తరఫున సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణకు ధన్యవాదాలు. మధ్యవర్తిత్వం దేశంలో రచ్చబండ వంటి రూపాల్లో ఎప్పటి నుంచో ఉంది. పలు కారణాలతో పరిశ్రమలు వివాదాలు ఎదుర్కొంటున్నాయి. హైదరాబాద్‌లో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కేంద్రం రావటం సంతోషం. ఆర్బిట్రేషన్ కేంద్రానికి హైదరాబాద్ అన్ని విధాలా అనువైన ప్రాంతం."

- కేసీఆర్, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి

ఇదీ చదవండి: 'న్యాయ వృత్తి లాభం కోసం కాదు.. సమాజ సేవకే'

Last Updated : Dec 4, 2021, 2:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.