ETV Bharat / city

పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా తెదేపా అధ్యక్షులు

రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని బ‌లోపేతం చేసే దిశ‌గా అధినేత చంద్ర‌బాబు అడుగులు వేస్తున్నారు. పార్టీని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి...కొత్త వారికి అవకాశం కల్పించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఆదివారం పార్లమెంట్ కమిటీలను ప్రకటించనున్నారు. జిల్లా పార్టీ అధ్యక్షుల స్థానంలో తొలిసారి పార్లమెంట్​ నియోజకవర్గాల వారీగా కమిటీలు వేసిన చంద్రబాబు.. పార్టీ స్వరూపాన్ని పూర్తిగా మార్చనున్నారు.

author img

By

Published : Sep 26, 2020, 10:45 PM IST

Updated : Sep 27, 2020, 3:05 AM IST

tdp-parlament-wise-presidents
tdp-parlament-wise-presidents

ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుందాం అనే పంథాలో తెలుగుదేశం పార్టీ సరికొత్త ప్రయోగాలకు శ్రీకారం చుట్టింది. పార్లమెంట్ నియోజకవర్గాల వారిగా కమిటీలకు అధినేత చంద్రబాబు శ్రీకారం చుట్టారు. తద్వారా కొత్త నాయకత్వాన్ని ప్రజలకు మరింత చేరువచేయవచ్చన్నది చంద్రబాబు ఆలోచన.

ప్రజలకు చేరువయ్యేందుకు..

2019 ఎన్నికల్లో ఓటమి తరువాత తెలుగుదేశం పార్టీ ఓటమికి గల కారణాలను చంద్రబాబు అధ్యయనం చేస్తూ... వచ్చారు. పార్లమెంట్ స్థానాల వారీగా నేతలతో వరుస సమావేశాలు నిర్వహించారు. పార్టీ నాయకులతో సుదీర్ఘ సంప్రదింపులు చేసి పార్టీకి నూతనోత్తేజం తేవాలని నిర్ణయించారు. ప్రజలకు మరింత చేరువవ్వడం, ఎక్కువ మంది యువ నాయకత్వానికి అవకాశాలు కల్పించటం లక్ష్యంగా పార్టీలో మార్పులకు శ్రీకారం చుట్టారు. ఇప్పటి వరకూ తెదేపాలో ఉన్న జిల్లా పార్టీ విధానం స్థానంలో.. పార్లమెంట్ పార్టీ విధానాన్ని తీసుకురానున్నారు. ఈ విధానం వల్ల ప్రజలకు మరింత దగ్గర అయ్యే అవకాశాలు, ప్రతిపక్షంగా ప్రజల సమస్యలు మరింత లోతుగా అర్ధం చేసుకొని వారి పక్షాన పోరాడటానికి ఉపయోగపడుతుందని పార్టీ అభిప్రాయపడుతోంది. మార్పు వల్ల యువనాయకత్వానికి ఎక్కువ అవకాశాలు కల్పించడానికి వెసులుబాటు ఉంటుదంని తెదేపా అధినాయకత్వం భావిస్తోంది.

పార్లమెంట్​ పార్టీ అధ్యక్షులు

ఈమేరకు 25 మంది పార్లమెంట్ పార్టీ అధ్యక్ష పదవులు,13 మంది జిల్లా సమన్వయకర్తల పదవులు, 13 పార్లమెంట్ ఇంఛార్జ్ పదవులు ఆదివారం తెదేపా ప్రకటించనుంది. రెండు పార్లమెంట్​లకు కలిపి ఒక పార్లమెంట్ ఇంఛార్జ్ ఉంటారు. ఒక్క అరకు పార్లమెంట్​కు మాత్రం ప్రత్యేకంగా ఇంఛార్జ్​ను నియమించనుంది. మొత్తంగా 51 పదవులను ప్రకటించనున్నారు.సామాజిక న్యాయం, యువ నాయకత్వానికి ప్రాధాన్యం, సీనియర్ నాయకులకు సముచిత స్థానం విధానంగా ఈ జాబితా సిద్ధమైనట్లు తెలుస్తోంది.

ఆదివారం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని ప్రకటించాలని తొలుత అనుకున్నా...రాష్ట్ర కమిటీ కసరత్తు పూర్తి కానందున అధ్యక్షుడి ప్రకటన వాయిదా వేశారు. రాష్ట్ర కమిటీతో పాటు..,రాష్ట్ర అధ్యక్షుడి ప్రకటన త్వరలోనే ఉంటుందని పార్టీ వర్గాల సమాచారం.

ఇదీ చదవండి:

ఐరాసలో సంస్కరణలు రావాల్సిందే: నరేంద్ర మోదీ

ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుందాం అనే పంథాలో తెలుగుదేశం పార్టీ సరికొత్త ప్రయోగాలకు శ్రీకారం చుట్టింది. పార్లమెంట్ నియోజకవర్గాల వారిగా కమిటీలకు అధినేత చంద్రబాబు శ్రీకారం చుట్టారు. తద్వారా కొత్త నాయకత్వాన్ని ప్రజలకు మరింత చేరువచేయవచ్చన్నది చంద్రబాబు ఆలోచన.

ప్రజలకు చేరువయ్యేందుకు..

2019 ఎన్నికల్లో ఓటమి తరువాత తెలుగుదేశం పార్టీ ఓటమికి గల కారణాలను చంద్రబాబు అధ్యయనం చేస్తూ... వచ్చారు. పార్లమెంట్ స్థానాల వారీగా నేతలతో వరుస సమావేశాలు నిర్వహించారు. పార్టీ నాయకులతో సుదీర్ఘ సంప్రదింపులు చేసి పార్టీకి నూతనోత్తేజం తేవాలని నిర్ణయించారు. ప్రజలకు మరింత చేరువవ్వడం, ఎక్కువ మంది యువ నాయకత్వానికి అవకాశాలు కల్పించటం లక్ష్యంగా పార్టీలో మార్పులకు శ్రీకారం చుట్టారు. ఇప్పటి వరకూ తెదేపాలో ఉన్న జిల్లా పార్టీ విధానం స్థానంలో.. పార్లమెంట్ పార్టీ విధానాన్ని తీసుకురానున్నారు. ఈ విధానం వల్ల ప్రజలకు మరింత దగ్గర అయ్యే అవకాశాలు, ప్రతిపక్షంగా ప్రజల సమస్యలు మరింత లోతుగా అర్ధం చేసుకొని వారి పక్షాన పోరాడటానికి ఉపయోగపడుతుందని పార్టీ అభిప్రాయపడుతోంది. మార్పు వల్ల యువనాయకత్వానికి ఎక్కువ అవకాశాలు కల్పించడానికి వెసులుబాటు ఉంటుదంని తెదేపా అధినాయకత్వం భావిస్తోంది.

పార్లమెంట్​ పార్టీ అధ్యక్షులు

ఈమేరకు 25 మంది పార్లమెంట్ పార్టీ అధ్యక్ష పదవులు,13 మంది జిల్లా సమన్వయకర్తల పదవులు, 13 పార్లమెంట్ ఇంఛార్జ్ పదవులు ఆదివారం తెదేపా ప్రకటించనుంది. రెండు పార్లమెంట్​లకు కలిపి ఒక పార్లమెంట్ ఇంఛార్జ్ ఉంటారు. ఒక్క అరకు పార్లమెంట్​కు మాత్రం ప్రత్యేకంగా ఇంఛార్జ్​ను నియమించనుంది. మొత్తంగా 51 పదవులను ప్రకటించనున్నారు.సామాజిక న్యాయం, యువ నాయకత్వానికి ప్రాధాన్యం, సీనియర్ నాయకులకు సముచిత స్థానం విధానంగా ఈ జాబితా సిద్ధమైనట్లు తెలుస్తోంది.

ఆదివారం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని ప్రకటించాలని తొలుత అనుకున్నా...రాష్ట్ర కమిటీ కసరత్తు పూర్తి కానందున అధ్యక్షుడి ప్రకటన వాయిదా వేశారు. రాష్ట్ర కమిటీతో పాటు..,రాష్ట్ర అధ్యక్షుడి ప్రకటన త్వరలోనే ఉంటుందని పార్టీ వర్గాల సమాచారం.

ఇదీ చదవండి:

ఐరాసలో సంస్కరణలు రావాల్సిందే: నరేంద్ర మోదీ

Last Updated : Sep 27, 2020, 3:05 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.